ETV Bharat / city

VIPS Visit TIRUMALA: నూతన సంవత్సర వేళ.. శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

author img

By

Published : Jan 1, 2022, 11:58 AM IST

Updated : Jan 1, 2022, 3:01 PM IST

VIPS Visit TIRUMALA: నూతన సంవత్సరం సందర్భంగా కలియుగ దైవం తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

VIPS Visit TIRUMALA
తిరుమల శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

VIPS Visit TIRUMALA: నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, తెలంగాణ కాంగ్రెస్​ నేత భట్టి విక్రమార్క, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఏపీ ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, తమిళనాడు మంత్రి గాంధీ, గుజరాత్‌ మంత్రి జితేందర్‌ చౌదరి, సినీ నటుడు సాయికుమార్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, బాలీవుడు నటి కంగనా రనౌత్‌.. స్వామివారిని దర్శించుకున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రముఖులకు రంగనాయకుల మండపంలో తితిదే అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు సినీ నటుడు సాయికుమార్‌ తెలిపారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలో సినీ పరిశ్రమలో అందరూ ఐకమత్యంగా నిర్ణయం తీసుకుంటే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం పలికారు. ప్రత్యేక రాహు కేతు పూజలు చేసిన కంగనా... అనంతరం శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శ్రీ మేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

ఇదీ చదవండి: NRI Donation for Yadadri Temple : యాదాద్రి గోపురం బంగారు తాపడానికి ఎన్​ఆర్​ఐ భారీ విరాళం

VIPS Visit TIRUMALA: నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, తెలంగాణ కాంగ్రెస్​ నేత భట్టి విక్రమార్క, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఏపీ ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, తమిళనాడు మంత్రి గాంధీ, గుజరాత్‌ మంత్రి జితేందర్‌ చౌదరి, సినీ నటుడు సాయికుమార్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, బాలీవుడు నటి కంగనా రనౌత్‌.. స్వామివారిని దర్శించుకున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రముఖులకు రంగనాయకుల మండపంలో తితిదే అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు సినీ నటుడు సాయికుమార్‌ తెలిపారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలో సినీ పరిశ్రమలో అందరూ ఐకమత్యంగా నిర్ణయం తీసుకుంటే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం పలికారు. ప్రత్యేక రాహు కేతు పూజలు చేసిన కంగనా... అనంతరం శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శ్రీ మేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

ఇదీ చదవండి: NRI Donation for Yadadri Temple : యాదాద్రి గోపురం బంగారు తాపడానికి ఎన్​ఆర్​ఐ భారీ విరాళం

Last Updated : Jan 1, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.