ETV Bharat / city

'నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలి' - haritha haram program at Begumpeta Learning Center

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ రావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బేగంపేట లెర్నింగ్ సెంటర్​లో డీజీపీ మహేందర్ రెడ్డి, నగర సీపీ అంజనీకుమార్​తో కలిసి హరితహారం కార్యక్రమం చేపట్టారు.

'హరితహారాన్ని అందరూ ఛాలెంజ్​గా తీసుకోవాలి'
author img

By

Published : Sep 27, 2019, 4:44 PM IST

'హరితహారాన్ని అందరూ ఛాలెంజ్​గా తీసుకోవాలి'

ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ కోలేటి దామోదర్​ రావు తెలిపారు. బేగంపేట లెర్నింగ్​ సెంటర్​లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి ఎదుగుదల చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ ఎస్కే​ జోషి, సినీనటి జయసుధ, నటుడు తనికెళ్ల భరణికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా వారు కూడా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్​ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: హరితహారం మహాయజ్ఞంలా సాగుతోంది: మంత్రి కొప్పుల

'హరితహారాన్ని అందరూ ఛాలెంజ్​గా తీసుకోవాలి'

ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ కోలేటి దామోదర్​ రావు తెలిపారు. బేగంపేట లెర్నింగ్​ సెంటర్​లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి ఎదుగుదల చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ ఎస్కే​ జోషి, సినీనటి జయసుధ, నటుడు తనికెళ్ల భరణికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా వారు కూడా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్​ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: హరితహారం మహాయజ్ఞంలా సాగుతోంది: మంత్రి కొప్పుల

Intro:సికింద్రాబాద్ యాంకర్.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రావు స్పష్టం చేశారు..సికింద్రాబాద్ బేగంపేట లర్నింగ్ సెంటర్ లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నగర సిపి అంజనీకుమార్ లతో కలిసి ఆయన హరితహారం కార్యక్రమం చేపట్టారు..సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ చాలెంజ్ పేరుతో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం అద్భుతంగా మొక్కలు నాటే కార్యక్రమం నడుస్తోందన్నారు..రాష్ట్ర పోలీసు అధికారులు మరియు ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు..మొక్కలు నాటడమే కాకుండా వాటి ఎదుగుదలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు..గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఛీప్ సెక్రటరీ ఎస్ కే జోషి సినీనటి జయసుధ తనికెళ్ల భరణి లకు ఆయన మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు..అదేవిధంగా వారు కూడా మరో ముగ్గురికి మొక్కలు నాటే ఈ ప్రక్రియను చాలెంజ్ చేయాలని పేర్కొన్నారు..బైట్. కోలేటి దామోదర్ రావు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.