ETV Bharat / city

Pawan tour: పవన్ శ్రమదానం.. పోలీసుల నోటీసులు.. ఏపీలో టెన్షన్

author img

By

Published : Oct 1, 2021, 8:17 PM IST

Updated : Oct 2, 2021, 9:13 AM IST

రాజమహేంద్రవరం పరిధిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ నోటీసులిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని తెలిపారు.

pawan kalyan
pawan kalyan

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రెండు జిల్లాల్లో సంకల్పించిన శ్రమదానంపై సందిగ్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలోని రహదారులు దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి పవన్‌ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. సభ నిర్వహణకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు.

మరోవైపు పవన్‌ పర్యటన దృష్ట్యా అధికారులు ఈ మార్గంలో గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసేశారు. రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు జారీ చేశారు. పవన్‌ ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోనూ పర్యటించనున్నారు.

జనసేన సభకు అనుమతిలేదు

‘‘హుకుంపేట పంచాయతీ బాలాజీపేట సెంటర్‌లో బహిరంగసభకు జనసేన పార్టీ నేతలు అనుమతి అడిగారు. సుమారు 20వేల మంది సభకు తరలివచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. బాలాజీపేట ప్రాంతంలో అంతమందితో సభ నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సభావేదిక మార్చుకోవాలని ఇప్పటికే జనసేన పార్టీ ప్రతినిధులకు సూచించాం. వారి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. బాలాజీపేటలో అయితే సభకు అనుమతివ్వలేదు. జనసేన తరఫున శ్రమదానానికి అనుమతి కోరలేదు.’’

-అదనపు ఎస్పీ లతామాధురి

వేదిక మార్చిన జనసేన

ఏపీలో రోడ్ల పరిస్థితికి నిరసనగా పవన్‌ కల్యాణ్‌ శనివారం చేపట్టనున్న శ్రమదానం కార్యక్రమం వేదిక మారింది. నిరసన కార్యక్రమాన్ని తొలుత రాజమహేంద్రవరంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరించడంతో వేదికను హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై పవన్‌ శ్రమదానం చేయనున్నారని జనసేన నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: Maa Elections: 'పవన్‌ మార్నింగ్‌ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా బడ్జెట్'

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రెండు జిల్లాల్లో సంకల్పించిన శ్రమదానంపై సందిగ్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలోని రహదారులు దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి పవన్‌ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. సభ నిర్వహణకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు.

మరోవైపు పవన్‌ పర్యటన దృష్ట్యా అధికారులు ఈ మార్గంలో గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసేశారు. రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు జారీ చేశారు. పవన్‌ ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోనూ పర్యటించనున్నారు.

జనసేన సభకు అనుమతిలేదు

‘‘హుకుంపేట పంచాయతీ బాలాజీపేట సెంటర్‌లో బహిరంగసభకు జనసేన పార్టీ నేతలు అనుమతి అడిగారు. సుమారు 20వేల మంది సభకు తరలివచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. బాలాజీపేట ప్రాంతంలో అంతమందితో సభ నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సభావేదిక మార్చుకోవాలని ఇప్పటికే జనసేన పార్టీ ప్రతినిధులకు సూచించాం. వారి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. బాలాజీపేటలో అయితే సభకు అనుమతివ్వలేదు. జనసేన తరఫున శ్రమదానానికి అనుమతి కోరలేదు.’’

-అదనపు ఎస్పీ లతామాధురి

వేదిక మార్చిన జనసేన

ఏపీలో రోడ్ల పరిస్థితికి నిరసనగా పవన్‌ కల్యాణ్‌ శనివారం చేపట్టనున్న శ్రమదానం కార్యక్రమం వేదిక మారింది. నిరసన కార్యక్రమాన్ని తొలుత రాజమహేంద్రవరంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరించడంతో వేదికను హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై పవన్‌ శ్రమదానం చేయనున్నారని జనసేన నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: Maa Elections: 'పవన్‌ మార్నింగ్‌ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా బడ్జెట్'

Last Updated : Oct 2, 2021, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.