గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు నిర్వహించిన నిర్బంధ తనిఖీల్లో గంజాయి తీసుకెళ్తూ హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులు పట్టుబడ్డారు. ఏపీ సీఎం జగన్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాల చుట్టుపక్కల తెల్లవారుజాము నుంచే సుమారు 500 గృహాలను పోలీసులు తనిఖీ చేశారు. ఎంతమంది ఉంటున్నారు...ఎంత కాలం నుంచి ఉంటున్నారనే విషయాలను పరిశీలించారు. ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఉన్నతాధికారులతో పాటు సుమారు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. వాహనాలను సైతం తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని పలు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు