ETV Bharat / city

మనోవేదనతో వ్యక్తి బలవన్మరణం.. భార్య ఫిర్యాదుపై కేసు

author img

By

Published : Sep 28, 2021, 5:20 PM IST

మనోవేదనతో ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాసరావు మంచానికే పరిమితమయ్యాడు. ఏమీ చేయలేని స్థితిని చూసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

person suicide
person suicide

తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంక గ్రామానికి చెందిన కే.శ్రీనివాసరావు(45) ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పురుగుమందు తాగాడని గమనించిన కుటుంబ సభ్యులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

పోలీసులు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది కాలం క్రితం ప్రమాదంలో గాయపడిన శ్రీనివాసరావు కాలుకు దెబ్బతగిలి మంచానికే పరిమితం అయ్యాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంక గ్రామానికి చెందిన కే.శ్రీనివాసరావు(45) ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పురుగుమందు తాగాడని గమనించిన కుటుంబ సభ్యులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

పోలీసులు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది కాలం క్రితం ప్రమాదంలో గాయపడిన శ్రీనివాసరావు కాలుకు దెబ్బతగిలి మంచానికే పరిమితం అయ్యాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : మూసినదికి వరద ఉద్ధృతి.. పలు ప్రాంతాల్లో హై అలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.