ETV Bharat / city

పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: తలసాని

author img

By

Published : Dec 29, 2020, 3:39 PM IST

సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని అన్నారు. 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందించారు.

TALASANI
పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: తలసాని

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో.. 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు చేయూత అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే.. తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో.. 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు చేయూత అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే.. తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

ఇవీచూడండి: ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి : కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.