ETV Bharat / city

రెండో డోసుకే పరిమితం చేసినా తీరని టీకా కష్టాలు

author img

By

Published : May 9, 2021, 6:40 AM IST

కరోనా టీకా పంపిణీ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఉదయాన్నే వరుసలో నిలుచున్నవారికి కూడా వ్యాక్సిన్​ దొరకడం కష్టంగా మారింది. మొదటి డోసు నిలిపివేసి.. కేవలం రెండో డోసు వారికే టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా.. భారీ సంఖ్యలో క్యూలు కనిపించాయి. టీకా కొరత, వ్యాక్సినేషన్​ అమలులో సిబ్బంది జాప్యం వెరసి ప్రజలకు కొత్తకష్టాలను తెచ్చిపెడుతోంది.

corona vaccine news in telangana
కరోనా టీకా రెండోదశ వ్యాక్సిన్ ప్రక్రియ

కొవిడ్‌ టీకాలకు శనివారం నుంచి కొత్త విధానం తెచ్చినా ప్రజలకు కష్టాలు తప్ప లేదు. మొదటి డోసు నిలిపివేసి.. కేవలం రెండో డోసు వారికే టీకాలని చెప్పినా భారీ క్యూలే కనిపించాయి. టీకాల కొరత వేధిస్తోంది. ఉదయాన్నే వచ్చి గంటల తరబడి నిల్చున్నా టోకెన్లు, టీకాలు లభించక జనం ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్‌ నిల్వలు తక్కువగా ఉండటంతో నిరాశతో వెనుదిరిగారు. అక్కడక్కడ ఆరోగ్య సిబ్బందితో ఘర్షణ పడ్డారు. పలుచోట్ల శనివారం రెండో డోసు కూడా నిలిపివేశారు. కొన్ని కేంద్రాల్లో ఉదయం 11 గంటల తర్వాతగానీ టీకాలు వేయడం ప్రారంభం కాలేదు. గంటల తరబడి ఎండలో నిలబడి జనం తల్లడిల్లిపోయారు. పలుచోట్ల తెల్లవారకముందే ఉదయం 5-6 గంటలకే వచ్చి క్యూకట్టారు. ఒక్కో కేంద్రానికి 200 మంది వరకు చేరుకున్నారు. గతంలో కేంద్రానికి 100 చొప్పున టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే లభ్యత తక్కువగా ఉండటంతో కొన్ని కేంద్రాల్లో 40-50తో సరిపెట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి పడిగాపులు పడినా వ్యాక్సిన్‌ లభించని వారు సిబ్బందితో గొడవలకు దిగారు.

పరిమిత సంఖ్యలో టోకెన్లు
కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లు తక్కువగా వస్తుండటంతో టోకెన్లు పరిమిత సంఖ్యలో ఇచ్చారు. టోకెన్లు అయిపోయాయని చెప్పినా కేంద్రాల దగ్గర ప్రజలు గంటలతరబడి పడిగాపులు కాశారు. తొలిడోసు కోసం స్లాట్లు బుక్‌ చేసుకున్నవారిలో కొందరు టీకా కేంద్రాలకు వచ్చారు. సమాచారం లేక కొందరు, ఆలస్యంగానైనా సరే వేస్తారేమోనన్న ఆశతో మరికొందరు వచ్చారు. లభ్యతను బట్టి.. ఒక్కో కేంద్రంలో సగటున 50-100 మందికి టోకెన్లు జారీ చేసి టీకాలు ఇచ్చి పంపించారు. వరుసలో మిగిలిన వారికి తదుపరి రోజుకోసం టోకెన్లు ఇచ్చారు.

* ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సిన ప్రజలు దాదాపు 13 లక్షల వరకు ఉంటారని అంచనా. వారికోసమని ఈనెల 15 వరకు తొలిడోసు టీకాల పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. అర్హులైన వారందరికీ రెండోడోసు ఇచ్చిన తరువాతే.. తొలిడోసు వారికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలి, రెండోడోసుకోసం కొవిన్‌ యాప్‌లో తీసుకున్న అపాయింట్‌మెంట్లు రద్దుచేసింది. శనివారం నుంచి వాకిన్‌ పద్ధతిలో(నేరుగా కేంద్రాలకు వెళ్తే) టీకాలు ఇస్తామని అధికారులు సూచించారు.

గేటు తెరవగానే నాలుగువందల మంది..
తొలి డోసుగా కొవాగ్జిన్‌ తీసుకుని 4 వారాలు, కొవిషీల్డ్‌ వేయించుకుని 6 వారాలు గడిస్తే శనివారం నుంచి రెండో డోసుకు అర్హులని వైద్యశాఖ చెప్పడంతో ఈ మేరకు గడువు దాటినవారు వ్యాక్సిన్‌ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి ఉదయం గేటు తెరవగానే ఒకేసారి నాలుగువందల మంది వచ్చారు. వారందరికీ టోకెన్లు ఇచ్చారు. మరో రెండువందల మంది రావడం.. గంటల తరబడి అక్కడే ఉండటంతో మధ్యాహ్నం మళ్లీ టోకెన్లు ఇచ్చి వ్యాక్సిన్లు వేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 56 మందికి వేశారు. నల్గొండ జిల్లాలో 31 మండలాలల్లోని 43 కేంద్రాల్లో 3,600 మందికి రెండో డోసు వేశారు.

పట్టించుకునేవారేరి!

మల్లయ్య అనే ఈ 80 ఏళ్ల వృద్ధుడు ఇప్పటివరకూ కొవిడ్‌ మొదటి డోస్‌ టీకా వేయించుకోలేదు. శనివారం నుంచి మొదటి డోస్‌ వేయడంలేదన్న విషయం తెలియక ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉదయాన్నే వచ్చారు. అక్కడ ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉసూరుమంటూ తిరిగి ఇంటి బాట పట్టారు.

గంటల తరబడి సురక్షిత దూరం పాటించకుండానే...
టీకా కేంద్రాల్లో చాలా చోట్ల సురక్షిత దూరం లేకుండా జనం గంటల తరబడి దగ్గర దగ్గరగానే నిలబడాల్సి వచ్చింది. ఉప్పల్‌ పీహెచ్‌సీ, కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ పీహెచ్‌సీ వద్ద ఉదయం నుంచే పెద్దఎత్తున జనం బారులుతీరారు. దూరం పాటించకుండా టోకెన్లు, టీకాల కోసం ఎగబడటంపై అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. కాప్రా సర్కిల్‌ జమ్మిగడ్డ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ ఇదే పరిస్థితి.
దేవరకొండ, మరికొన్ని మండలాల్లోని కేంద్రాల వద్ద భారీ రద్దీ కనిపించింది. హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆసుపత్రికి జనం భారీ సంఖ్యలో వచ్చారు. గంటల తరబడి క్యూలో ఉన్నామని.. వెనుకగేటు నుంచి కొందరిని పంపిస్తున్నారని టీకాకోసం వచ్చిన కొందరు సిబ్బందితో ఘర్షణకు దిగారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం, నాగారం మరికొన్ని మండలాల్లో శని, ఆదివారాల్లో టీకా లేదు అంటూ బోర్డు పెట్టారు. టీకాల కొరత కారణంగా నిలిపివేశారు.

ఇంగ్లాండ్‌లో మొదటి డోస్‌.. ఇక్కడ రెండో డోస్‌ వేయరా?

Rav!r@ju$3487ఈ విశ్రాంత ఉద్యోగి పేరు వెంకటరమణ కంతేటి. వయసు 64 ఏళ్లు. సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌ కాలనీ వాసి. ఫిబ్రవరిలో తమ పిల్లలను చూడడానికి ఇంగ్లాండ్‌ వెళ్లారు. అక్కడ మార్చి 22న ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్‌) టీకా మొదటి డోస్‌ వేయించుకున్నారు. తర్వాత ఇండియాలోనూ రెండో డోస్‌ వేయించుకోచ్చనడంతో హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. వారికి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో రెండో డోస్‌ వేయడానికి స్థానిక సిబ్బంది నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. శనివారం మహ్మద్‌గూడ టీకా కేంద్రం వద్ద తన ఆవేదనను వెలిబుచ్చారు.

ఇదీ చదవండి: ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?: హైకోర్టు

కొవిడ్‌ టీకాలకు శనివారం నుంచి కొత్త విధానం తెచ్చినా ప్రజలకు కష్టాలు తప్ప లేదు. మొదటి డోసు నిలిపివేసి.. కేవలం రెండో డోసు వారికే టీకాలని చెప్పినా భారీ క్యూలే కనిపించాయి. టీకాల కొరత వేధిస్తోంది. ఉదయాన్నే వచ్చి గంటల తరబడి నిల్చున్నా టోకెన్లు, టీకాలు లభించక జనం ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్‌ నిల్వలు తక్కువగా ఉండటంతో నిరాశతో వెనుదిరిగారు. అక్కడక్కడ ఆరోగ్య సిబ్బందితో ఘర్షణ పడ్డారు. పలుచోట్ల శనివారం రెండో డోసు కూడా నిలిపివేశారు. కొన్ని కేంద్రాల్లో ఉదయం 11 గంటల తర్వాతగానీ టీకాలు వేయడం ప్రారంభం కాలేదు. గంటల తరబడి ఎండలో నిలబడి జనం తల్లడిల్లిపోయారు. పలుచోట్ల తెల్లవారకముందే ఉదయం 5-6 గంటలకే వచ్చి క్యూకట్టారు. ఒక్కో కేంద్రానికి 200 మంది వరకు చేరుకున్నారు. గతంలో కేంద్రానికి 100 చొప్పున టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే లభ్యత తక్కువగా ఉండటంతో కొన్ని కేంద్రాల్లో 40-50తో సరిపెట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి పడిగాపులు పడినా వ్యాక్సిన్‌ లభించని వారు సిబ్బందితో గొడవలకు దిగారు.

పరిమిత సంఖ్యలో టోకెన్లు
కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లు తక్కువగా వస్తుండటంతో టోకెన్లు పరిమిత సంఖ్యలో ఇచ్చారు. టోకెన్లు అయిపోయాయని చెప్పినా కేంద్రాల దగ్గర ప్రజలు గంటలతరబడి పడిగాపులు కాశారు. తొలిడోసు కోసం స్లాట్లు బుక్‌ చేసుకున్నవారిలో కొందరు టీకా కేంద్రాలకు వచ్చారు. సమాచారం లేక కొందరు, ఆలస్యంగానైనా సరే వేస్తారేమోనన్న ఆశతో మరికొందరు వచ్చారు. లభ్యతను బట్టి.. ఒక్కో కేంద్రంలో సగటున 50-100 మందికి టోకెన్లు జారీ చేసి టీకాలు ఇచ్చి పంపించారు. వరుసలో మిగిలిన వారికి తదుపరి రోజుకోసం టోకెన్లు ఇచ్చారు.

* ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సిన ప్రజలు దాదాపు 13 లక్షల వరకు ఉంటారని అంచనా. వారికోసమని ఈనెల 15 వరకు తొలిడోసు టీకాల పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. అర్హులైన వారందరికీ రెండోడోసు ఇచ్చిన తరువాతే.. తొలిడోసు వారికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలి, రెండోడోసుకోసం కొవిన్‌ యాప్‌లో తీసుకున్న అపాయింట్‌మెంట్లు రద్దుచేసింది. శనివారం నుంచి వాకిన్‌ పద్ధతిలో(నేరుగా కేంద్రాలకు వెళ్తే) టీకాలు ఇస్తామని అధికారులు సూచించారు.

గేటు తెరవగానే నాలుగువందల మంది..
తొలి డోసుగా కొవాగ్జిన్‌ తీసుకుని 4 వారాలు, కొవిషీల్డ్‌ వేయించుకుని 6 వారాలు గడిస్తే శనివారం నుంచి రెండో డోసుకు అర్హులని వైద్యశాఖ చెప్పడంతో ఈ మేరకు గడువు దాటినవారు వ్యాక్సిన్‌ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి ఉదయం గేటు తెరవగానే ఒకేసారి నాలుగువందల మంది వచ్చారు. వారందరికీ టోకెన్లు ఇచ్చారు. మరో రెండువందల మంది రావడం.. గంటల తరబడి అక్కడే ఉండటంతో మధ్యాహ్నం మళ్లీ టోకెన్లు ఇచ్చి వ్యాక్సిన్లు వేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 56 మందికి వేశారు. నల్గొండ జిల్లాలో 31 మండలాలల్లోని 43 కేంద్రాల్లో 3,600 మందికి రెండో డోసు వేశారు.

పట్టించుకునేవారేరి!

మల్లయ్య అనే ఈ 80 ఏళ్ల వృద్ధుడు ఇప్పటివరకూ కొవిడ్‌ మొదటి డోస్‌ టీకా వేయించుకోలేదు. శనివారం నుంచి మొదటి డోస్‌ వేయడంలేదన్న విషయం తెలియక ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉదయాన్నే వచ్చారు. అక్కడ ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉసూరుమంటూ తిరిగి ఇంటి బాట పట్టారు.

గంటల తరబడి సురక్షిత దూరం పాటించకుండానే...
టీకా కేంద్రాల్లో చాలా చోట్ల సురక్షిత దూరం లేకుండా జనం గంటల తరబడి దగ్గర దగ్గరగానే నిలబడాల్సి వచ్చింది. ఉప్పల్‌ పీహెచ్‌సీ, కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ పీహెచ్‌సీ వద్ద ఉదయం నుంచే పెద్దఎత్తున జనం బారులుతీరారు. దూరం పాటించకుండా టోకెన్లు, టీకాల కోసం ఎగబడటంపై అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. కాప్రా సర్కిల్‌ జమ్మిగడ్డ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ ఇదే పరిస్థితి.
దేవరకొండ, మరికొన్ని మండలాల్లోని కేంద్రాల వద్ద భారీ రద్దీ కనిపించింది. హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆసుపత్రికి జనం భారీ సంఖ్యలో వచ్చారు. గంటల తరబడి క్యూలో ఉన్నామని.. వెనుకగేటు నుంచి కొందరిని పంపిస్తున్నారని టీకాకోసం వచ్చిన కొందరు సిబ్బందితో ఘర్షణకు దిగారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం, నాగారం మరికొన్ని మండలాల్లో శని, ఆదివారాల్లో టీకా లేదు అంటూ బోర్డు పెట్టారు. టీకాల కొరత కారణంగా నిలిపివేశారు.

ఇంగ్లాండ్‌లో మొదటి డోస్‌.. ఇక్కడ రెండో డోస్‌ వేయరా?

Rav!r@ju$3487ఈ విశ్రాంత ఉద్యోగి పేరు వెంకటరమణ కంతేటి. వయసు 64 ఏళ్లు. సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌ కాలనీ వాసి. ఫిబ్రవరిలో తమ పిల్లలను చూడడానికి ఇంగ్లాండ్‌ వెళ్లారు. అక్కడ మార్చి 22న ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్‌) టీకా మొదటి డోస్‌ వేయించుకున్నారు. తర్వాత ఇండియాలోనూ రెండో డోస్‌ వేయించుకోచ్చనడంతో హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. వారికి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో రెండో డోస్‌ వేయడానికి స్థానిక సిబ్బంది నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. శనివారం మహ్మద్‌గూడ టీకా కేంద్రం వద్ద తన ఆవేదనను వెలిబుచ్చారు.

ఇదీ చదవండి: ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.