ETV Bharat / city

భారీ వర్షాల ఎఫెక్ట్​: పాతబస్తీ ఆగమాగం

భారీ వర్షాలు హైదరాబాద్​ను కనీవినీ ఎరుగని రీతిలో బాధలకు గురిచేశాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో పాతబస్తీలో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉండగా.. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వాహనాలు, ఇంటి సామాన్లు అన్నీ కొట్టుకుపోయి బురద మాత్రం మిగిలిపోయింది. గుర్రం చెరువు, పల్లె చెరువు కట్టలకు అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు.

author img

By

Published : Oct 20, 2020, 10:13 AM IST

oldcity effected with heavy rain
భారీ వర్షాల ఎఫెక్ట్​: పాతబస్తీ ఆగమాగం

ఏకధాటిగా కురిసిన వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు భారీ నష్టాన్ని చవి చూశాయి. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బాబానగర్, గాజీ మిల్లట్, శివాజీ నగర్, ఉప్పుగూడ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇండ్లలోకి, విధుల్లోకి వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చింది.

భారీ వర్షాల ఎఫెక్ట్​: పాతబస్తీ ఆగమాగం

చెరువుకట్టల మరమ్మతులు:

చాంద్రాయణగుట్ట సమీపంలోని అల్​జుబైల్ కాలనీ మొత్తం ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు అలాగే నిలిచిపోయింది. ఇండ్లలోకి భారీగా బురద నీరు చేరింది. ఇప్పటివరకు ఈ ప్రాంతానికి 3 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇంటి సామగ్రి సైతం నీళ్లలో కొట్టుకెళ్లాయి. కాలనీ చుట్టూ భారీగా చెత్త, బురద పేరుకుపోయింది. ఫలక్​నుమా ఓవర్ బ్రిడ్జ్​కూ 6 అడుగుల భారీ గుంత పడడం వల్ల రాక పోకలు ఆగిపోయాయి. వందల సంఖ్యలో ప్రజలను అధికారులు ఇక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. కాలనీ మొత్తం ఇంకా అంధకారంలోనే ఉండిపోయింది.

నగర శివారులోని బాలాపూర్ గుర్రం చెరువు కట్ట తెగడం వల్ల బాబానగర్ ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ నిండా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహంలో భారీగా వాహనాలు కొట్టుకెళ్లి తుక్కుగా మిగిలిపోయాయి. ప్రస్తుతానికి వరద నీరు ఖాళీ అయినప్పటికీ నష్టం భారీగా జరిగింది. గుర్రం చెరువు, పల్లె చెరువులకు తెగిన కట్టల మరమ్మతులు పూర్తయ్యాయి. వర్షం వచ్చినా చెరువుల నుంచి నీరు బయటకు రాకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: వరద నుంచి త్రుటిలో తప్పించుకున్న 8 మంది

ఏకధాటిగా కురిసిన వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు భారీ నష్టాన్ని చవి చూశాయి. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బాబానగర్, గాజీ మిల్లట్, శివాజీ నగర్, ఉప్పుగూడ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇండ్లలోకి, విధుల్లోకి వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చింది.

భారీ వర్షాల ఎఫెక్ట్​: పాతబస్తీ ఆగమాగం

చెరువుకట్టల మరమ్మతులు:

చాంద్రాయణగుట్ట సమీపంలోని అల్​జుబైల్ కాలనీ మొత్తం ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు అలాగే నిలిచిపోయింది. ఇండ్లలోకి భారీగా బురద నీరు చేరింది. ఇప్పటివరకు ఈ ప్రాంతానికి 3 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇంటి సామగ్రి సైతం నీళ్లలో కొట్టుకెళ్లాయి. కాలనీ చుట్టూ భారీగా చెత్త, బురద పేరుకుపోయింది. ఫలక్​నుమా ఓవర్ బ్రిడ్జ్​కూ 6 అడుగుల భారీ గుంత పడడం వల్ల రాక పోకలు ఆగిపోయాయి. వందల సంఖ్యలో ప్రజలను అధికారులు ఇక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. కాలనీ మొత్తం ఇంకా అంధకారంలోనే ఉండిపోయింది.

నగర శివారులోని బాలాపూర్ గుర్రం చెరువు కట్ట తెగడం వల్ల బాబానగర్ ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ నిండా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహంలో భారీగా వాహనాలు కొట్టుకెళ్లి తుక్కుగా మిగిలిపోయాయి. ప్రస్తుతానికి వరద నీరు ఖాళీ అయినప్పటికీ నష్టం భారీగా జరిగింది. గుర్రం చెరువు, పల్లె చెరువులకు తెగిన కట్టల మరమ్మతులు పూర్తయ్యాయి. వర్షం వచ్చినా చెరువుల నుంచి నీరు బయటకు రాకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: వరద నుంచి త్రుటిలో తప్పించుకున్న 8 మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.