ETV Bharat / city

NGT : జల వనరుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ - ఎన్జీటీ

NGT : జల వనరుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించి నిశిత పరిశీలన చేపట్టనున్నట్లు ఎన్జీటీ ప్రత్యేక బెంచ్ తెలిపింది. ట్రైబ్యునల్‌లో దాఖలైన పలు కేసులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన విచారణ అనంతరం తీర్పును వెలువరించింది.

NGT
NGT
author img

By

Published : Apr 22, 2022, 8:42 AM IST

NGT : జల వనరుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించి నిశిత పరిశీలన చేపట్టనున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ప్రత్యేక బెంచ్‌ తెలిపింది. ట్రైబ్యునల్‌లో దాఖలైన పలు కేసులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన విచారణ అనంతరం తీర్పును వెలువరించింది. ‘‘రాష్ట్రంలోని మంజీరా, ఖాజిపల్లి, ఇస్నాపూర్‌, గండిగూడెం, నక్కవాగు, ఇతర చెరువులు, నీటి వనరుల పరిరక్షణకు వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణను ట్రైబ్యునల్‌ చేపడుతుంది. పర్యావరణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. సీఎస్‌ మూడు నెలలకోసారి కమిటీ తీరును పర్యవేక్షిస్తారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి పటాన్‌చెరు-బొల్లారం ప్రాంతంలోని 224 పరిశ్రమలు పక్కాగా నిబంధనలు పాటించేలా చూడాల్సి ఉంటుంది’’ అని ట్రైబ్యునల్‌ పేర్కొంది.

NGT : జల వనరుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించి నిశిత పరిశీలన చేపట్టనున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ప్రత్యేక బెంచ్‌ తెలిపింది. ట్రైబ్యునల్‌లో దాఖలైన పలు కేసులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన విచారణ అనంతరం తీర్పును వెలువరించింది. ‘‘రాష్ట్రంలోని మంజీరా, ఖాజిపల్లి, ఇస్నాపూర్‌, గండిగూడెం, నక్కవాగు, ఇతర చెరువులు, నీటి వనరుల పరిరక్షణకు వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణను ట్రైబ్యునల్‌ చేపడుతుంది. పర్యావరణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. సీఎస్‌ మూడు నెలలకోసారి కమిటీ తీరును పర్యవేక్షిస్తారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి పటాన్‌చెరు-బొల్లారం ప్రాంతంలోని 224 పరిశ్రమలు పక్కాగా నిబంధనలు పాటించేలా చూడాల్సి ఉంటుంది’’ అని ట్రైబ్యునల్‌ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.