ETV Bharat / city

ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు.. 4 మరణాలు

author img

By

Published : Dec 5, 2020, 8:15 PM IST

ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు.. 4 మరణాలు
ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు.. 4 మరణాలు

ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్​లో 24 గంటల వ్యవధిలో 630 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 8,71,305కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 7,024 మంది మృతి చెందారు.

కరోనా నుంచి మరో 882 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి మెుత్తం సంఖ్య 8.58 లక్షలకు చేరింది. ప్రస్తుతం 6,166 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 57,132 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 1,03,50,283 కు చేరింది.

ఇదీ చదవండి: భాజపాలోకి వలసలు: రాములమ్మ ఓకేనట.. జానా డౌటేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.