ETV Bharat / city

'జర్నలిస్టులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి'

author img

By

Published : Jun 10, 2020, 8:03 PM IST

Updated : Jun 10, 2020, 8:25 PM IST

జర్నలిస్టుల సమస్యలు, భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులకు భద్రత, సహకారం అందించాలని కేసీఆర్​కు రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రజా స్వామ్యంలో మీడియా పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

mp revanth reddy wrote open letter to cm k chandrasekhar rao on journalist problems
సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఎంపీ రేవంత్​ రెడ్డి

ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాలని పేర్కొంటూ... ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రతి పాత్రికేయునికి ఉచితంగా కరోనా పరీక్షల నిర్వహించాలని కోరారు. ప్రతి కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. ఇటీవల మృతి చెందిన మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కొవిడ్​-19 కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్​గా ఉండి, సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. చాలీచాలని జీతాలు, అర్ధాకలి జీవితాలతో అనుక్షణం ప్రజలకు సమాచారం అందించడం కోసం మీడియా ప్రతినిధులు నిరంతరం పని చేస్తున్నారని వారి సేవలను గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు కూడా కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువ విలేకరి మనోజ్ కుమార్ కరోనాతో మరణించటంతో అనేక మంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాలని పేర్కొంటూ... ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రతి పాత్రికేయునికి ఉచితంగా కరోనా పరీక్షల నిర్వహించాలని కోరారు. ప్రతి కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. ఇటీవల మృతి చెందిన మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కొవిడ్​-19 కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్​గా ఉండి, సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. చాలీచాలని జీతాలు, అర్ధాకలి జీవితాలతో అనుక్షణం ప్రజలకు సమాచారం అందించడం కోసం మీడియా ప్రతినిధులు నిరంతరం పని చేస్తున్నారని వారి సేవలను గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు కూడా కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువ విలేకరి మనోజ్ కుమార్ కరోనాతో మరణించటంతో అనేక మంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: చర్చలు సఫలం.. ఆ ఐదు డిమాండ్లకు మంత్రి సానుకూలం

Last Updated : Jun 10, 2020, 8:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.