ETV Bharat / city

'ప్రజల సొమ్ముతో పార్టీని నడుపుతున్నారా..?'

ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తన గురించి సంస్కారం లేని కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీని నడుపుతున్నారా..? అని ప్రశ్నించారు. తాను ఎలా ఉంటే ఎవరికెందుకని ప్రశ్నించారు. జగన్ అన్ని కులాలను సమానంగా చూస్తారని భావించే ప్రజలు ఓట్లు వేశారని... ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని హితవు పలికారు.

author img

By

Published : Aug 13, 2020, 7:22 PM IST

mp raghurama krishna raju
mp raghurama krishna raju

ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవేందర్​రెడ్డిని డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని.. ఆయన పనేదో ఆయన చేసుకోవాలని, తనపై కామెంట్లు చేయడమేంటని ప్రశ్నించారు. ఒక ఎంపీపై ప్రభుత్వ ఉద్యోగి నీఛమైన కామెంట్లు చేస్తుంటే... కనీసం పిలిచి మందలించరా అని నిలదీశారు.

ఈ విషయంపై సీఎం జగన్ స్పందించకుంటే పార్లమెంటులో, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. అతన్ని 48 గంటల్లో విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో తనపై గుర్రంపాటి చేసిన విమర్శలను రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు.

ప్రజల డబ్బుతో పార్టీని నడుపుతున్నారా..? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజల డబ్బును వెచ్చించి పార్టీ పనులు చేయించుకునే వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నాళ్లు అక్రమాలను సహిస్తూ ఉంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 'రెడ్డీజం' వచ్చిందని... ఇది మంచిది కాదని స్పష్టం చేశారు. ఒక కులానికి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవారిని సహించవద్దని సీఎం జగన్​కు సూచించారు.

'ప్రజల సొమ్ముతో పార్టీని నడుపుతున్నారా..?'

ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవేందర్​రెడ్డిని డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని.. ఆయన పనేదో ఆయన చేసుకోవాలని, తనపై కామెంట్లు చేయడమేంటని ప్రశ్నించారు. ఒక ఎంపీపై ప్రభుత్వ ఉద్యోగి నీఛమైన కామెంట్లు చేస్తుంటే... కనీసం పిలిచి మందలించరా అని నిలదీశారు.

ఈ విషయంపై సీఎం జగన్ స్పందించకుంటే పార్లమెంటులో, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. అతన్ని 48 గంటల్లో విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో తనపై గుర్రంపాటి చేసిన విమర్శలను రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు.

ప్రజల డబ్బుతో పార్టీని నడుపుతున్నారా..? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజల డబ్బును వెచ్చించి పార్టీ పనులు చేయించుకునే వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నాళ్లు అక్రమాలను సహిస్తూ ఉంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 'రెడ్డీజం' వచ్చిందని... ఇది మంచిది కాదని స్పష్టం చేశారు. ఒక కులానికి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవారిని సహించవద్దని సీఎం జగన్​కు సూచించారు.

'ప్రజల సొమ్ముతో పార్టీని నడుపుతున్నారా..?'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.