ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో అమాననీయం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా.. రోడ్డుపైనే ఉంచేశారు ఆ కుమారులు. రోడ్డుపైన ఆటోలోనే 12 గంటలుగా సూర్యకాంతం(80) తలదాచుకుంది.
కొన్నేళ్లుగా ఆకివీడులోని ఓ ఇంట్లో సూర్యకాంతం అద్దెకు ఉంటోంది. గురువారం వడదెబ్బ తగలడం వల్ల ఇంటి యజమాని ఆస్పత్రిలో చూపించారు. చికిత్స తర్వాత ఇంటి యజమాని... ఆమె కుమారులు ఉంటున్న పెదకాపవరానికి పంపించారు. అనారోగ్యంతో ఉన్న తనను కుమారులు ఇంట్లోకి రానివ్వట్లేదని ఆ తల్లి బోరున విలపించింది.
ఇదీ చదవండి: