ETV Bharat / city

ఎమ్మెల్యే రాజాసింగ్ అలక మంచం ఎక్కారు.. ఎందుకు..? ఎవరి మీద..?

author img

By

Published : Jul 27, 2022, 5:20 PM IST

MLA Rajasing Disappointment: సంచలనాత్మక, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​.. ఇప్పుడు అలక మంచం ఎక్కారు. తెరాస నేతలపై విమర్శలు, కేటీఆర్​పై సెటైర్లు, బుల్డోజర్ల కామెంట్లతో హల్​చల్​ చేసే.. రాజాసింగ్​ అలకకు కారణమేంటీ.. అసలు ఆ అలక ఎవరి మీద అనుకుంటున్నారా..?

MLA Rajasing Disappointment on Party leaders
MLA Rajasing Disappointment on Party leaders

MLA Rajasing Disappointment: గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​.. తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తుంటారు. అయితే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా.. అలక మంచం ఎక్కి.. వార్తల్లో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా రాజాసింగ్​.. రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అప్పటి నుంచి తనదైనశైలిలో తెరాస నేతలపై విమర్శలు, కేటీఆర్​పై సెటైర్లతో పాటు పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం.. రాజాసింగ్​ అలిగారు. ఎవరిమీదో కాదండి.. సొంత పార్టీపైనే..!

నిజామాబాద్​ జిల్లా బోధన్ పట్టణంలో "ప్రజాగోస.. భాజపా భరోసా" యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రంలో రాజాసింగ్​తో పాటు పలువురు భాజపా అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే.. ఈరోజు యాత్ర జరుగుతుండగానే రాజాసింగ్​ కాన్వాయ్​ మధ్యలో నుంచి​ వెళ్లిపోయారు. ఏడు రోజులుగా యాత్ర కొనసాగుతోన్నా.. జనం నుంచి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. దీనిపై ఇప్పటికే రాజాసింగ్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం​. అయితే ఈరోజు కూడా.. యాత్రలో జనం అంతగా పాల్గొనకపోవటంతో కొంత అసహనానికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజాసింగ్​​ ఏకంగా కాన్వాయ్​ మధ్యలో నుంచి వాకౌట్​ చేశారు.

అయితే.. తాను వెళ్లిపోతున్నట్టు కనీసం.. జిల్లా, నియోజకవర్గ నాయకులకు కూడా సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం. రాజాసింగ్​ వాకౌట్​తో ఉలిక్కిపడ్డ భాజపా నాయకులు.. ఏం జరిగిందో..? ఏం చేయాలో.. తెలియక తలలుపట్టుకున్నారు. చేసేదేమీలేక ముఖ్య అతిథి లేకుండానే వచ్చిన ఆ కొంత మంది కార్యకర్తలతోనే సభను కొనసాగించారు. అయితే.. రాజాసింగ్​ అలక మాత్రం భాజపా జిల్లా, నియోజకవర్గ నాయకులపైనే అని అర్థమవుతోంది. యాత్రకు జనసమీకరణ చేయలేకపోయారనో.. లేక జనంలోకి పార్టీని సరిగ్గా తీసుకెళ్లలేకపోతున్నారనో.. కారణమేదైనా జిల్లా, నియోజకవర్గ నాయకుల పనితీరు నచ్చకపోవటమే రాజాసింగ్​ అలకకు కారణమని.. శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:

MLA Rajasing Disappointment: గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​.. తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తుంటారు. అయితే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా.. అలక మంచం ఎక్కి.. వార్తల్లో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా రాజాసింగ్​.. రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అప్పటి నుంచి తనదైనశైలిలో తెరాస నేతలపై విమర్శలు, కేటీఆర్​పై సెటైర్లతో పాటు పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం.. రాజాసింగ్​ అలిగారు. ఎవరిమీదో కాదండి.. సొంత పార్టీపైనే..!

నిజామాబాద్​ జిల్లా బోధన్ పట్టణంలో "ప్రజాగోస.. భాజపా భరోసా" యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రంలో రాజాసింగ్​తో పాటు పలువురు భాజపా అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే.. ఈరోజు యాత్ర జరుగుతుండగానే రాజాసింగ్​ కాన్వాయ్​ మధ్యలో నుంచి​ వెళ్లిపోయారు. ఏడు రోజులుగా యాత్ర కొనసాగుతోన్నా.. జనం నుంచి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. దీనిపై ఇప్పటికే రాజాసింగ్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం​. అయితే ఈరోజు కూడా.. యాత్రలో జనం అంతగా పాల్గొనకపోవటంతో కొంత అసహనానికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజాసింగ్​​ ఏకంగా కాన్వాయ్​ మధ్యలో నుంచి వాకౌట్​ చేశారు.

అయితే.. తాను వెళ్లిపోతున్నట్టు కనీసం.. జిల్లా, నియోజకవర్గ నాయకులకు కూడా సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం. రాజాసింగ్​ వాకౌట్​తో ఉలిక్కిపడ్డ భాజపా నాయకులు.. ఏం జరిగిందో..? ఏం చేయాలో.. తెలియక తలలుపట్టుకున్నారు. చేసేదేమీలేక ముఖ్య అతిథి లేకుండానే వచ్చిన ఆ కొంత మంది కార్యకర్తలతోనే సభను కొనసాగించారు. అయితే.. రాజాసింగ్​ అలక మాత్రం భాజపా జిల్లా, నియోజకవర్గ నాయకులపైనే అని అర్థమవుతోంది. యాత్రకు జనసమీకరణ చేయలేకపోయారనో.. లేక జనంలోకి పార్టీని సరిగ్గా తీసుకెళ్లలేకపోతున్నారనో.. కారణమేదైనా జిల్లా, నియోజకవర్గ నాయకుల పనితీరు నచ్చకపోవటమే రాజాసింగ్​ అలకకు కారణమని.. శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.