రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ హరిత ప్లాజాలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు అమలుపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉన్న పలు సమస్యలను అధికారులు.. మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: గోల్కొండ హోటల్లో అఖిలపక్ష నేతల సమావేశం