ETV Bharat / city

త్వరలో మిషన్​ హైదరాబాద్​ : కేటీఆర్​

author img

By

Published : Mar 15, 2020, 9:13 PM IST

రాష్ట్రానికి హైదరాబాద్‌ ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. వరుసగా ఐదేళ్ల నుంచి దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్‌ ఎంపికవుతోందని వెల్లడించారు. టీఎస్‌ ఐపాస్‌ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని టీఎస్‌బీపాస్‌ను అమల్లోకి తెస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందించేందుకు మిషన్‌ హైదరాబాద్‌ను తీసుకువస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు.

minister ktr speaks on hyderabad development in assembly
త్వరలో మిషన్​ హైదరాబాద్​ : కేటీఆర్​

పట్టణ ప్రగతిని విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి మంత్రి కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. పట్టణాభివృద్ధి, పట్టణ ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచిందని పేర్కొన్నారు. వరుసగా ఐదేళ్ల నుంచి దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్‌ ఎంపికవుతోందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ అభివృద్ధి, అవసరమైన అన్ని హంగులను సమకూర్చేందుకు సీఎం సంకల్పించారని కేటీఆర్‌ వివరించారు. ఈ బడ్జెట్‌లో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు అదనంగా కేటాయించారని తెలిపారు.

త్వరలో మిషన్​ హైదరాబాద్​ : కేటీఆర్​

పల్లెలు, గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన పురపాలక చట్టం ద్వారా ఒక మంచి విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం. టీఎస్‌ ఐపాస్‌ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని టీఎస్‌బీపాస్‌ను అమల్లోకి తెస్తున్నాం. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందించేందుకు మిషన్‌ హైదరాబాద్‌ను తీసుకువస్తున్నాం.

- మంత్రి కేటీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా మిషన్‌ భగీరథను తీసుకువచ్చామని కేటీఆర్‌ తెలిపారు. ప్రజా రవాణా, మంచినీరు, పార్కుల ఏర్పాటు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. వ్యర్థాలు, చెత్త తొలగింపు చర్యలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందుకు అవసరమైన నిధులు, వాహనాలను సమకూర్చుతున్నామని తెలిపారు. నెలనెలా పట్టణప్రగతికి నిధులు అందిస్తామని.. పట్టణప్రగతిని నిరంతర స్ఫూర్తిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విలీన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని.. శంషాబాద్‌ వైపు అదనంగా ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. రోజూ 4 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే మెట్రోను అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇవీచూడండి: 'కేసీఆర్, ఓవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ'

పట్టణ ప్రగతిని విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి మంత్రి కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. పట్టణాభివృద్ధి, పట్టణ ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచిందని పేర్కొన్నారు. వరుసగా ఐదేళ్ల నుంచి దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్‌ ఎంపికవుతోందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ అభివృద్ధి, అవసరమైన అన్ని హంగులను సమకూర్చేందుకు సీఎం సంకల్పించారని కేటీఆర్‌ వివరించారు. ఈ బడ్జెట్‌లో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు అదనంగా కేటాయించారని తెలిపారు.

త్వరలో మిషన్​ హైదరాబాద్​ : కేటీఆర్​

పల్లెలు, గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన పురపాలక చట్టం ద్వారా ఒక మంచి విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం. టీఎస్‌ ఐపాస్‌ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని టీఎస్‌బీపాస్‌ను అమల్లోకి తెస్తున్నాం. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందించేందుకు మిషన్‌ హైదరాబాద్‌ను తీసుకువస్తున్నాం.

- మంత్రి కేటీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా మిషన్‌ భగీరథను తీసుకువచ్చామని కేటీఆర్‌ తెలిపారు. ప్రజా రవాణా, మంచినీరు, పార్కుల ఏర్పాటు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. వ్యర్థాలు, చెత్త తొలగింపు చర్యలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందుకు అవసరమైన నిధులు, వాహనాలను సమకూర్చుతున్నామని తెలిపారు. నెలనెలా పట్టణప్రగతికి నిధులు అందిస్తామని.. పట్టణప్రగతిని నిరంతర స్ఫూర్తిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విలీన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని.. శంషాబాద్‌ వైపు అదనంగా ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. రోజూ 4 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే మెట్రోను అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇవీచూడండి: 'కేసీఆర్, ఓవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.