ETV Bharat / city

'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'

author img

By

Published : Nov 19, 2020, 12:21 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులుండబోవని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. బల్దియాపై గులాబీ జెండా ఎగరేయటం ఖాయమని వెల్లడించారు.

మజ్లీస్​తో పొత్తు లేదు... తెరాస మహిళదే బల్దియా పీఠం
మజ్లీస్​తో పొత్తు లేదు... తెరాస మహిళదే బల్దియా పీఠం
'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'

బల్దియా పీఠం తెరాసదేనని మంత్రి కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్‌తో తమకు ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేసిన కేటీఆర్... గ్రేటర్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 డివిజన్లు గెలిచామన్నారు.

ఈసారి గతంలో గెలిచిన ఐదుతోపాటు మరో 5 డివిజన్లలో గెలుస్తామని చెప్పారు. బల్దియాపై తప్పకుండా గులాబీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: దేశం మొత్తం తెలంగాణ​ వైపు చూస్తోంది: కేటీఆర్​

'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'

బల్దియా పీఠం తెరాసదేనని మంత్రి కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్‌తో తమకు ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేసిన కేటీఆర్... గ్రేటర్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 డివిజన్లు గెలిచామన్నారు.

ఈసారి గతంలో గెలిచిన ఐదుతోపాటు మరో 5 డివిజన్లలో గెలుస్తామని చెప్పారు. బల్దియాపై తప్పకుండా గులాబీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: దేశం మొత్తం తెలంగాణ​ వైపు చూస్తోంది: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.