ETV Bharat / city

'వినియోగంలో లేని పారిశ్రామిక భూములు వెనక్కి తీసుకుంటాం'

author img

By

Published : Sep 10, 2020, 12:25 PM IST

Updated : Sep 10, 2020, 1:34 PM IST

వినియోగంలో లేని పారిశ్రామిక భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి కేటీఆర్​ పునరుద్ఘాటించారు. అవసరానికి మించి కర్మాగారాలకు స్థలాలు ఇవ్వడం లేదన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పారిశ్రామిక వాడల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. భూనిర్వాసితులకు పరిహారం, హైదరాబాద్ ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్​ సమాధానం ఇచ్చారు. ఫార్మాసిటీ భూనిర్వాసితులకు చట్టపరంగా పూర్తి పరిహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఐతే కొందరు విపక్ష నేతలు రాజకీయ దురుద్దేశంతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.... ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని కేటీఆర్​ తెలిపారు.

minister ktr give clarity on industrial lands in council
'వినియోగంలో లేని పారిశ్రామిక భూములు వెనక్కి తీసుకుంటాం'

రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీకి ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు సుమారు 9,110 ఎకరాల 38 గుంటల వరకు భూ సేకరణ చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక నేతలు రాజకీయ దురుద్దేశంతో ఫార్మాసిటీ భూ సేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నామని తెలిపారు. కోల్పోయిన భూమికి భూమి ఇచ్చే ఆలోచన లేదని, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మండలిలో కేటీఆర్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్.టీ సౌకర్యంలో భాగంగా సర్వీస్ మొత్తంలో ఒక్కసారి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని మంత్రి కేటీఆర్​ తెలిపారు. వాటికి సంబంధించిన కేటాయింపుల వివరాలను మంత్రి వెల్లడించారు. 2014-15లో రూ.125.51 కోట్లు, 2015-16లో రూ.163.71కోట్లు, 2016-17లో రూ.235.32 కోట్లు, 2017-18లో రూ.235.28 కోట్లు, 2018-19లో రూ.128.92 కోట్లు, 2019-20లో రూ. 230.95 కోట్లు కేటాయించమన్నారు.

బాలానగర్ సహకార పారిశ్రామిక లీజ్ హోల్డర్లను ఫ్రీ హోల్డర్లుగా మార్చాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. గతంలో 47 ఎకరాలకు సుమారు 226 యూనిట్లు కేటాయించారని మంత్రి పేర్కొన్నారు. అవసరానికి మించి స్థలం తీసుకుని దాన్ని వినియోగించని వారి నుంచి సుమారు 13 నుంచి 14వందల ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నామన్నారు.

శాసనమండలిలో కేటీఆర్ ప్రసంగం

ఇవీ చూడండి: రఫేల్​ జెట్ల​ విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు

రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీకి ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు సుమారు 9,110 ఎకరాల 38 గుంటల వరకు భూ సేకరణ చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక నేతలు రాజకీయ దురుద్దేశంతో ఫార్మాసిటీ భూ సేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నామని తెలిపారు. కోల్పోయిన భూమికి భూమి ఇచ్చే ఆలోచన లేదని, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మండలిలో కేటీఆర్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్.టీ సౌకర్యంలో భాగంగా సర్వీస్ మొత్తంలో ఒక్కసారి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని మంత్రి కేటీఆర్​ తెలిపారు. వాటికి సంబంధించిన కేటాయింపుల వివరాలను మంత్రి వెల్లడించారు. 2014-15లో రూ.125.51 కోట్లు, 2015-16లో రూ.163.71కోట్లు, 2016-17లో రూ.235.32 కోట్లు, 2017-18లో రూ.235.28 కోట్లు, 2018-19లో రూ.128.92 కోట్లు, 2019-20లో రూ. 230.95 కోట్లు కేటాయించమన్నారు.

బాలానగర్ సహకార పారిశ్రామిక లీజ్ హోల్డర్లను ఫ్రీ హోల్డర్లుగా మార్చాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. గతంలో 47 ఎకరాలకు సుమారు 226 యూనిట్లు కేటాయించారని మంత్రి పేర్కొన్నారు. అవసరానికి మించి స్థలం తీసుకుని దాన్ని వినియోగించని వారి నుంచి సుమారు 13 నుంచి 14వందల ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నామన్నారు.

శాసనమండలిలో కేటీఆర్ ప్రసంగం

ఇవీ చూడండి: రఫేల్​ జెట్ల​ విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు

Last Updated : Sep 10, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.