ETV Bharat / city

నాయిని నర్సింహారెడ్డి త్వరలో కోలుకుంటారు: ఈటల - అపోలో ఆసుపత్రిలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఈటల పరామర్శ

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి... కోలుకొని త్వరలో తిరిగి వస్తారని మంత్రి ఈటల రాజేందర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయినిని పరామర్శించి... ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

minister eetala rajendar visitation nayini narsimhareddy in appolo hospital
నాయిని నర్సింహారెడ్డి త్వరలో కోలుకుంటారు :ఈటల
author img

By

Published : Oct 17, 2020, 9:23 PM IST

జూబ్లీహిల్స్​ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని... వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

నాయిని కుటుంబసభ్యులు, అల్లుడు శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని... త్వరలో కోలుకొని వస్తారని ఆశిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈటల వెంట మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ కూడా ఉన్నారు.

జూబ్లీహిల్స్​ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని... వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

నాయిని కుటుంబసభ్యులు, అల్లుడు శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని... త్వరలో కోలుకొని వస్తారని ఆశిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈటల వెంట మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ కూడా ఉన్నారు.

ఇదీ చూడండి: విష జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి: ఈటల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.