ETV Bharat / city

Minister Botsa On PRC issue: 'ఏపీ ఉద్యోగుల పీఆర్సీపై మా స్టాండ్ ఇదే'

author img

By

Published : Nov 29, 2021, 6:55 PM IST

పీఆర్సీ విషయంలో ఉద్యోగులు(minister botsa satyanarayana comments on PRC issue) కొంత సంయమనం పాటించాలన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. సర్పంచ్​ల ఆందోళనలపై(minister botsa reaction on ap sarpanches protest) స్పందించిన మంత్రి.. 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ నిర్వహణకే ఖర్చు చేశామని చెప్పారు.

ap employees prc
ఏపీ ఉద్యోగుల పీఆర్సీ

Minister Botsa On PRC issue: ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satyanarayana comments on prc) అన్నారు. ఇప్పటికే ఉద్యోగులతో పలుమార్లు సంప్రదింపులు జరిపామని చెప్పారు. విజయనగరంలో మాట్లాడిన మంత్రి.. ఐఆర్ ప్రకటించామని.. మిగిలిన అంశాలపై ఉద్యోగులు కొంత సంయమనం పాటించాలని కోరారు.

బిల్లుల విషయమై పురపాలక సంఘాల్లో.. గుత్తేదారుల ఆందోళనపైనా మంత్రి స్పందించారు. పనులు చేసిన గుత్తేదారులందరికీ తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణ ఖర్చుల చెల్లింపులకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని (minister botsa reaction on ap sarpanches protest for panchayat funds)మంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలు పరిశీలించకుండా ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. వరదల విషయంలోనూ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యంగా వహించటం లేదని స్పష్టం చేశారు.

కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు..

వేతన సవరణతోపాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు(employees JAC protest) ఆందోళన బాటపట్టనున్నాయి. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సంఘ నేతలు.. డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు.. ప్రాంతీయ సదస్సులూ తలపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది తొలి దశ ఆందోళన మాత్రమేనని.. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

ఉద్యమ కార్యాచరణ నోటీసును డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తామని నేతలు చెప్పారు. రెండు నెలలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఉద్యమం దిశగా తమను నెట్టిందని.. ఇందుకు సర్కారే బాధ్యత వహించాలని అన్నారు.

ఇదీ చదవండి : cabinet sub committee on Corona: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. మంత్రివర్గ ఉపసంఘం నియామకం

Kishan reddy comments on KCR: 'ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించండి'

Minister Botsa On PRC issue: ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satyanarayana comments on prc) అన్నారు. ఇప్పటికే ఉద్యోగులతో పలుమార్లు సంప్రదింపులు జరిపామని చెప్పారు. విజయనగరంలో మాట్లాడిన మంత్రి.. ఐఆర్ ప్రకటించామని.. మిగిలిన అంశాలపై ఉద్యోగులు కొంత సంయమనం పాటించాలని కోరారు.

బిల్లుల విషయమై పురపాలక సంఘాల్లో.. గుత్తేదారుల ఆందోళనపైనా మంత్రి స్పందించారు. పనులు చేసిన గుత్తేదారులందరికీ తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణ ఖర్చుల చెల్లింపులకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని (minister botsa reaction on ap sarpanches protest for panchayat funds)మంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలు పరిశీలించకుండా ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. వరదల విషయంలోనూ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యంగా వహించటం లేదని స్పష్టం చేశారు.

కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు..

వేతన సవరణతోపాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు(employees JAC protest) ఆందోళన బాటపట్టనున్నాయి. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సంఘ నేతలు.. డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు.. ప్రాంతీయ సదస్సులూ తలపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది తొలి దశ ఆందోళన మాత్రమేనని.. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

ఉద్యమ కార్యాచరణ నోటీసును డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తామని నేతలు చెప్పారు. రెండు నెలలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఉద్యమం దిశగా తమను నెట్టిందని.. ఇందుకు సర్కారే బాధ్యత వహించాలని అన్నారు.

ఇదీ చదవండి : cabinet sub committee on Corona: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. మంత్రివర్గ ఉపసంఘం నియామకం

Kishan reddy comments on KCR: 'ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.