తమకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని ఎల్బీనగర్ మన్సురాబాద్ కాలనీవాసులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. తమకు ఇవ్వకుండా స్థానిక నాయకులు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కట్టిస్తామని తమ స్థలం తీసుకొని... ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమ కాలనీకి చెందిన 150 మంది కుటుంబాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: రూ.85 లక్షలు విలువైన అరటి పండును తినేశాడు!