ETV Bharat / city

బావర్చి బిర్యానీలో బల్లి..! సగం తిన్నాక చూసుకున్న కార్పొరేటర్​.. ఆ తర్వాత..

author img

By

Published : May 27, 2022, 7:29 PM IST

Updated : May 27, 2022, 7:52 PM IST

Lizard in Biryani: బిర్యానీ అంటే బావర్చి.. బావర్చి అంటే బిర్యానీ.. అలాంటి బావర్చి బిర్యానీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. బిర్యానీకి పెట్టింది పేరైన.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి హోటల్‌పై ఫిర్యాదు నమోదైంది. బావర్చి నుంచి తెచ్చుకున్న బిర్యానీ పార్శిల్​లో బల్లి రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Lizard appear in Bawarchi Biryani when ramnagar corporater ravichary eating
Lizard appear in Bawarchi Biryani when ramnagar corporater ravichary eating
బావర్చి బిర్యానీలో బల్లి.. సగం తిన్నాక చూసుకున్న కార్పొరేటర్​.. ఆ తర్వాత..!

Lizard in Biryani: హైదరాబాద్​లో ఆర్టీసీ క్రాస్​ రోడ్​లోని బావర్చి బిర్యానీ సెంటర్​ ఎంత ఫేమసో.. కేవలం నగరవాసులకే కాదు దేశవిదేశాల్లోని బిర్యానీ ప్రియలందరికీ తెలుసు. అయితే... ఇప్పుడు ఆ బావర్చి నుంచి తీసుకొచ్చిన బిర్యానీలో బల్లి రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి.. బావర్చి హోటల్​ నుంచి బిర్యానీ పార్శిల్​ తెప్పించుకున్నారు. ఘుమఘుమలాడుతోన్న బిర్యానీని ప్లేట్​లో వడ్డించుకుని.. ఆస్వాదిస్తూ ఆరగిస్తున్నారు.

సగం వరకు తిన్న తర్వాత.. ప్లేట్​లో ఏదో తేడాగా ఓ ఆకారం కనిపించింది. తినటం ఆపేసి.. ఏంటా అని పరికించి చూసిన రవిచారి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎందుకంటే.. అది అచ్చంగా బల్లి. అంతవరకు ఎంతో ఇష్టంగా ఆరగించిన బిర్యానీలో బల్లి కనిపించటంతో.. కడుపులో మొత్తం తిప్పినట్టైంది. వెంటనే.. ప్లేట్​లో ఉన్న ఆ చనిపోయిన బల్లిని వీడియో తీసిన కార్పొరేటర్​.. చిక్కడపల్లి పోలీసులు, జీహెచ్​ఎంసీ ఫుడ్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రవిచారి ఫిర్యాదుతో.. పోలీసులు, అధికారులు హోటల్​కు చేరుకుని వంటగదిని తనిఖీ చేశారు. బిర్యానీ ప్యాకెట్​ను స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. నమూనాలను పరీక్ష నిమిత్తం నాచారం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. బావర్చి హోటల్‌కు షోకాజు నోటీసులు జారీ చేశారు.

ఇవీ చూడండి:

బావర్చి బిర్యానీలో బల్లి.. సగం తిన్నాక చూసుకున్న కార్పొరేటర్​.. ఆ తర్వాత..!

Lizard in Biryani: హైదరాబాద్​లో ఆర్టీసీ క్రాస్​ రోడ్​లోని బావర్చి బిర్యానీ సెంటర్​ ఎంత ఫేమసో.. కేవలం నగరవాసులకే కాదు దేశవిదేశాల్లోని బిర్యానీ ప్రియలందరికీ తెలుసు. అయితే... ఇప్పుడు ఆ బావర్చి నుంచి తీసుకొచ్చిన బిర్యానీలో బల్లి రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి.. బావర్చి హోటల్​ నుంచి బిర్యానీ పార్శిల్​ తెప్పించుకున్నారు. ఘుమఘుమలాడుతోన్న బిర్యానీని ప్లేట్​లో వడ్డించుకుని.. ఆస్వాదిస్తూ ఆరగిస్తున్నారు.

సగం వరకు తిన్న తర్వాత.. ప్లేట్​లో ఏదో తేడాగా ఓ ఆకారం కనిపించింది. తినటం ఆపేసి.. ఏంటా అని పరికించి చూసిన రవిచారి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎందుకంటే.. అది అచ్చంగా బల్లి. అంతవరకు ఎంతో ఇష్టంగా ఆరగించిన బిర్యానీలో బల్లి కనిపించటంతో.. కడుపులో మొత్తం తిప్పినట్టైంది. వెంటనే.. ప్లేట్​లో ఉన్న ఆ చనిపోయిన బల్లిని వీడియో తీసిన కార్పొరేటర్​.. చిక్కడపల్లి పోలీసులు, జీహెచ్​ఎంసీ ఫుడ్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రవిచారి ఫిర్యాదుతో.. పోలీసులు, అధికారులు హోటల్​కు చేరుకుని వంటగదిని తనిఖీ చేశారు. బిర్యానీ ప్యాకెట్​ను స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. నమూనాలను పరీక్ష నిమిత్తం నాచారం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. బావర్చి హోటల్‌కు షోకాజు నోటీసులు జారీ చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : May 27, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.