ETV Bharat / city

భాజపాలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ భాజపాలో చేరనున్నట్టు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీశైలం గౌడ... ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇవాళ దిల్లీకి చేరుకున్న శ్రీశ్రైలం గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

author img

By

Published : Feb 21, 2021, 12:11 PM IST

Updated : Feb 21, 2021, 3:31 PM IST

భాజపాలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..?
భాజపాలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..?

తెలంగాణలో కాంగ్రెస్​కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని విడడంతో రాష్ట్రంలో పార్టీ బలహీనంగా మారింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరికొందరు నాయకులు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో... మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

పార్టీని వీడొద్దని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కూన శ్రీశైలం గౌడ్... భాజపా నాయకులతో కలిసి దిల్లీ వెళ్లారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలకు కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీ చేరుకున్న శ్రీశైలం గౌడ్ ఇవాళ కమలం గూటికి చేరనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్​కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని విడడంతో రాష్ట్రంలో పార్టీ బలహీనంగా మారింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరికొందరు నాయకులు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో... మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

పార్టీని వీడొద్దని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కూన శ్రీశైలం గౌడ్... భాజపా నాయకులతో కలిసి దిల్లీ వెళ్లారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలకు కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీ చేరుకున్న శ్రీశైలం గౌడ్ ఇవాళ కమలం గూటికి చేరనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.

ఇదీ చూడండి: వైఎస్ షర్మిలను కలిసిన తెరాస ఎమ్మెల్యే కుమారుడు

Last Updated : Feb 21, 2021, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.