ETV Bharat / city

'వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి' - వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సాహించాలి: ఆర్​కె గుప్తా

ప్రభుత్వాలు వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు కృష్ణానది యాజమాన్య బోర్డు ఛైర్మన్​ ఆర్​కె గుప్తా. హైదరాబాద్​లో జరిగిన 24వ అంతర్జాతీయ హైడ్రో సదస్సుకు ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఇజ్రాయిల్​, సింగపూర్​, పశ్చిమ అమెరికా దేశాల మాదిరిగా నీటి పునర్వినియోగంపై దృష్టిసారించాలన్నారు.

krishna river management board chairman rk guptha
వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సాహించాలి: ఆర్​కె గుప్తా
author img

By

Published : Dec 18, 2019, 4:09 PM IST

వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఛైర్మన్​ ఆర్​కె గుప్తా ఆకాంక్షించారు. హైదరాబాద్​లో జరిగిన 24వ అంతర్జాతీయ హైడ్రో సదస్సుకు గుప్తా గౌరవ అతిథిగా హాజరయ్యారు. హైడ్రాలిక్స్​, నీటివనరుల వినియోగం, తీరప్రాంత ఇంజనీరింగ్ నైపుణ్యతపై ఆయన ప్రసంగించారు.

భారతదేశంలో 80 శాతం నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారని.. అదే అమెరికాలో 40 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని గుప్తా తెలిపారు. మనదేశంలో వరి పంట పండించడం వల్ల ఎక్కువ నీటిని కేటాయించాల్సి వస్తోందన్నారు. మన ప్రభుత్వాలు వరికి ప్రత్యామ్నాయ పంటను సాగుచేసే విధంగా రైతులను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయిల్​, సింగపూర్​, పశ్చిమ అమెరికా దేశాల్లో నీటి పునర్వినియోగం ఎక్కువగా జరుగుతోందని.. ఆదిశగా మిగతా దేశాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా కరవులు, వరదలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటి వల్ల నగరాల్లో నీటి సరఫరా తగ్గి.. వేసవిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు.. నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు.

వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సాహించాలి: ఆర్​కె గుప్తా

ఇవీచూడండి: తెలంగాణ సన్న రకం వంగడాలకు దేశమంతా గిరాకీ!

వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఛైర్మన్​ ఆర్​కె గుప్తా ఆకాంక్షించారు. హైదరాబాద్​లో జరిగిన 24వ అంతర్జాతీయ హైడ్రో సదస్సుకు గుప్తా గౌరవ అతిథిగా హాజరయ్యారు. హైడ్రాలిక్స్​, నీటివనరుల వినియోగం, తీరప్రాంత ఇంజనీరింగ్ నైపుణ్యతపై ఆయన ప్రసంగించారు.

భారతదేశంలో 80 శాతం నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారని.. అదే అమెరికాలో 40 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని గుప్తా తెలిపారు. మనదేశంలో వరి పంట పండించడం వల్ల ఎక్కువ నీటిని కేటాయించాల్సి వస్తోందన్నారు. మన ప్రభుత్వాలు వరికి ప్రత్యామ్నాయ పంటను సాగుచేసే విధంగా రైతులను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయిల్​, సింగపూర్​, పశ్చిమ అమెరికా దేశాల్లో నీటి పునర్వినియోగం ఎక్కువగా జరుగుతోందని.. ఆదిశగా మిగతా దేశాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా కరవులు, వరదలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటి వల్ల నగరాల్లో నీటి సరఫరా తగ్గి.. వేసవిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు.. నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు.

వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సాహించాలి: ఆర్​కె గుప్తా

ఇవీచూడండి: తెలంగాణ సన్న రకం వంగడాలకు దేశమంతా గిరాకీ!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.