ETV Bharat / city

కిడారి, సోమ హత్య కేసులో కీలక నిందితుడు లొంగుబాటు

author img

By

Published : Mar 18, 2020, 8:50 PM IST

Updated : Mar 18, 2020, 10:26 PM IST

ఏపీలోని అరకులో ఇద్దరు రాజకీయ నాయకుల హత్య కేసులో ప్రధాన నిందితుడు..12 కేసులతో సంబంధం ఉన్న మావోయిస్టు నేత రణదేవ్​ ఒడిశాలోని మల్కన్​గిరి​ పోలీసులకు లొంగిపోయాడు. మావోయిస్టుల పట్ల గిరిజనులకు నమ్మకం లేకపోవటం, పోలీసుల కూబింగ్ వల్ల తాను లొంగిపోతున్నట్లు రణదేవ్​ తెలిపాడు.

Kidari and Soma murder accused maoist arrested
Kidari and Soma murder accused maoist arrested

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు కీలక నేత... ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఏఓబీ మిలటరీ ప్లాటున్ సభ్యుడిగా ఉన్న సాంబ కోర అలియాస్​ రణదేవ్ అలియాస్ దేవో... ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఇతనితోపాటు కట్​ఆఫ్ ఏరియాకు చెందిన ఏడుగురు మిలీషియా సభ్యులు కూడా లొంగిపోయారు. లివిటిపుట్టులోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్య కేసుతోపాటు 12 ఘటనలతో ఈయనకు సంబంధం ఉంది.

2017లో మావోయిస్టు పార్టీలో సభ్యునిగా చేరి... పెద్దబయలు ఏరియా కమిటీలో పనిచేశారు. అనంతరం ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఉండే మిలటరీ ప్లాటూన్ సభ్యునిగా ఉన్నారు. దేవోపై ఒడిశా ప్రభుత్వం రెండు లక్షల రివార్డును ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీసులు కూంబింగ్ ఎక్కువ కావడం... ఏఓబీ జంటురాయిలో జరిగిన ఘటనతో మావోయిస్టుల పట్ల గిరిజనులకు ఎటువంటి నమ్మకం లేదని తెలిసిందని.. అందుకే తాను లొంగిపోతున్నాని ఎస్పీకి రణదేవ్​ తెలిపారు.

కిడారి, సోమ హత్య కేసు... కీలక నిందితుడు లొంగుబాటు

ఇదీ చదవండి: ఏవోబీలో ఇంటింటా పోలీసుల తనిఖీ

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు కీలక నేత... ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఏఓబీ మిలటరీ ప్లాటున్ సభ్యుడిగా ఉన్న సాంబ కోర అలియాస్​ రణదేవ్ అలియాస్ దేవో... ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఇతనితోపాటు కట్​ఆఫ్ ఏరియాకు చెందిన ఏడుగురు మిలీషియా సభ్యులు కూడా లొంగిపోయారు. లివిటిపుట్టులోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్య కేసుతోపాటు 12 ఘటనలతో ఈయనకు సంబంధం ఉంది.

2017లో మావోయిస్టు పార్టీలో సభ్యునిగా చేరి... పెద్దబయలు ఏరియా కమిటీలో పనిచేశారు. అనంతరం ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఉండే మిలటరీ ప్లాటూన్ సభ్యునిగా ఉన్నారు. దేవోపై ఒడిశా ప్రభుత్వం రెండు లక్షల రివార్డును ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీసులు కూంబింగ్ ఎక్కువ కావడం... ఏఓబీ జంటురాయిలో జరిగిన ఘటనతో మావోయిస్టుల పట్ల గిరిజనులకు ఎటువంటి నమ్మకం లేదని తెలిసిందని.. అందుకే తాను లొంగిపోతున్నాని ఎస్పీకి రణదేవ్​ తెలిపారు.

కిడారి, సోమ హత్య కేసు... కీలక నిందితుడు లొంగుబాటు

ఇదీ చదవండి: ఏవోబీలో ఇంటింటా పోలీసుల తనిఖీ

Last Updated : Mar 18, 2020, 10:26 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.