ETV Bharat / city

వైద్య సిబ్బంది భద్రత.. ప్రభుత్వ బాధ్యత

author img

By

Published : Apr 6, 2020, 5:46 AM IST

కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో రాత్రి పదిగంటల వరకు సమావేశం జరిగింది. కరోనా వైరస్​ నియంత్రణ చర్యలను మరింత అంకితభావంతో కొనసాగిస్తామని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

వైద్య సిబ్బంది భద్రత.. ప్రభుత్వ బాధ్యత
వైద్య సిబ్బంది భద్రత.. ప్రభుత్వ బాధ్యత

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులతో రాత్రి పది గంటల వరకు సీఎం చర్చించారు. కరోనా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు, ఫలితాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వైద్యఆరోగ్యశాఖ కృషి అమోఘం..

వ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తామని సీఎం కేసీఆర్​ భరోసా ఇచ్చారు. కరోనా బాధితులు కలిసిన ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖ కృషి అమోఘమని ప్రశంసించారు. గొప్ప సేవలు అందిస్తోన్న.. సిబ్బంది భద్రతపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించిందన్నారు. సిబ్బంది ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దిల్లీ మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు.

రోగుల సంఖ్య పెరిగినా..

సీఎంఆర్‌ఎఫ్‌కు వస్తున్న విరాళాలతో మాస్కులు, పీపీఈలు, కొనుగోలు చేయాలని సూచించారు. టెస్ట్ కిట్స్, పీపీఈలు, మాస్కులు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోగుల సంఖ్య పెరిగినా ఇబ్బంది కలగకుండా కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులతో రాత్రి పది గంటల వరకు సీఎం చర్చించారు. కరోనా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు, ఫలితాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వైద్యఆరోగ్యశాఖ కృషి అమోఘం..

వ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తామని సీఎం కేసీఆర్​ భరోసా ఇచ్చారు. కరోనా బాధితులు కలిసిన ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖ కృషి అమోఘమని ప్రశంసించారు. గొప్ప సేవలు అందిస్తోన్న.. సిబ్బంది భద్రతపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించిందన్నారు. సిబ్బంది ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దిల్లీ మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు.

రోగుల సంఖ్య పెరిగినా..

సీఎంఆర్‌ఎఫ్‌కు వస్తున్న విరాళాలతో మాస్కులు, పీపీఈలు, కొనుగోలు చేయాలని సూచించారు. టెస్ట్ కిట్స్, పీపీఈలు, మాస్కులు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోగుల సంఖ్య పెరిగినా ఇబ్బంది కలగకుండా కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.