ETV Bharat / city

KCR announcement on jobs: '2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం'

author img

By

Published : Oct 5, 2021, 3:41 PM IST

Updated : Oct 5, 2021, 4:55 PM IST

jobs-recruitment-in-2-or-3-months-in-telangana-cm-kcr-announced-in-assembly
jobs-recruitment-in-2-or-3-months-in-telangana-cm-kcr-announced-in-assembly

15:39 October 05

2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం

2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం

సీఎం కేసీఆర్​ ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశముందని సీఎం కేసీఆర్​ వివరించారు. 

ఎక్కడి వాళ్లకు అక్కడే

"నూతన జోనల్​ విధానం ప్రకారంగా రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తయిపోతుంది. ఆ తర్వాత.. ఏ జిల్లా వాళ్లకు ఆ జిల్లా కేడర్​ పోస్టులు ఇచ్చేస్తాం. ఏ మండలానికి ఎంత మంది సిబ్బంది ఉండాలనేది.. లెక్క ఉంటుంది. దాని ప్రకారం జిల్లాలో ఎంత మంది సిబ్బంది అవసరముంది అనేది తెలుస్తుంది. జోనల్​ విధానం అనేది ఈ మధ్యే వచ్చింది. అది ఒక్కసారి ల్యాండ్​ అయిపోతే మనకు కూడా ఎంత సంఖ్య ఉందని తెలుస్తుంది. ఆ ప్రక్రియ కూడా 2, 3 నెలల్లో రిక్రూట్​మెంట్​ చేసేస్తాం. కొంత మంది రేపే చేయాలి. ఎల్లుండే చేయాలని పట్టుపడుతున్నారు. అలా చేసేది కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది కదా. నిన్న గాక మొన్న కదా మన జోనల్​ విధానం వచ్చింది. మనం తీసుకొచ్చుకున్న జోనల్​ విధానాన్ని మనమే ధిక్కరించలేం కదా. అందుకే ఈ దసరా పండుగ తర్వాత ఉద్యోగులతో నేను మాట్లాడతా. ఇప్పటికే సీఎస్​ మాట్లాడారు. ఒక్కసారి సెట్​ అయిపోతే.. ఎక్కడివాళ్లకు అక్కడే రిక్రూట్​మెంట్​ జరుగుతుంది. ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాకు ఆనందంగా సేవ చేసుకుంటారు. నాకున్న అంచనా ప్రకారం.. ఇప్పుడిచ్చిన లక్షా యాభై వేలు కాక.. ఇంకో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు వస్తాయి. అవి కూడా సౌకర్యవంతంగా.. ఎక్కడి వాళ్లకు అక్కడే." - సీఎం కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి:

15:39 October 05

2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం

2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం

సీఎం కేసీఆర్​ ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశముందని సీఎం కేసీఆర్​ వివరించారు. 

ఎక్కడి వాళ్లకు అక్కడే

"నూతన జోనల్​ విధానం ప్రకారంగా రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తయిపోతుంది. ఆ తర్వాత.. ఏ జిల్లా వాళ్లకు ఆ జిల్లా కేడర్​ పోస్టులు ఇచ్చేస్తాం. ఏ మండలానికి ఎంత మంది సిబ్బంది ఉండాలనేది.. లెక్క ఉంటుంది. దాని ప్రకారం జిల్లాలో ఎంత మంది సిబ్బంది అవసరముంది అనేది తెలుస్తుంది. జోనల్​ విధానం అనేది ఈ మధ్యే వచ్చింది. అది ఒక్కసారి ల్యాండ్​ అయిపోతే మనకు కూడా ఎంత సంఖ్య ఉందని తెలుస్తుంది. ఆ ప్రక్రియ కూడా 2, 3 నెలల్లో రిక్రూట్​మెంట్​ చేసేస్తాం. కొంత మంది రేపే చేయాలి. ఎల్లుండే చేయాలని పట్టుపడుతున్నారు. అలా చేసేది కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది కదా. నిన్న గాక మొన్న కదా మన జోనల్​ విధానం వచ్చింది. మనం తీసుకొచ్చుకున్న జోనల్​ విధానాన్ని మనమే ధిక్కరించలేం కదా. అందుకే ఈ దసరా పండుగ తర్వాత ఉద్యోగులతో నేను మాట్లాడతా. ఇప్పటికే సీఎస్​ మాట్లాడారు. ఒక్కసారి సెట్​ అయిపోతే.. ఎక్కడివాళ్లకు అక్కడే రిక్రూట్​మెంట్​ జరుగుతుంది. ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాకు ఆనందంగా సేవ చేసుకుంటారు. నాకున్న అంచనా ప్రకారం.. ఇప్పుడిచ్చిన లక్షా యాభై వేలు కాక.. ఇంకో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు వస్తాయి. అవి కూడా సౌకర్యవంతంగా.. ఎక్కడి వాళ్లకు అక్కడే." - సీఎం కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Oct 5, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.