ETV Bharat / city

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్, ఉప్పెన చిత్ర బృందం - పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం

తిరుమల శ్రీవారిని ప్రముఖులు సందర్శించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌.. శ్రీనివాసుడికి పూజలు నిర్వహించారు. విజయోత్సాహంలో ఉన్న 'ఉప్పెన' సినిమా యూనిట్ కూడా.. స్వామివారిని దర్శించుకుంది.

isro-chairmen-and-uppena-movie-unit-visits-tirumala
శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్, ఉప్పెన చిత్ర బృందం
author img

By

Published : Feb 27, 2021, 10:38 AM IST

తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్​​తో పాటు శాస్త్రవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగించనున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులను పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజల నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు వేదాశీర్వచనం చేసి... తీర్థప్రసాదాలు అందజేశారు. అమోజానియా-1తో పాటు మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు.

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్, ఉప్పెన చిత్ర బృందం

శ్రీనివాసుడికి ఉప్పెన బృందం కృతజ్ఞతలు

వెంకన్నకు ఉప్పెన చిత్ర బృందం ప్రత్యేక పూజలు చేసింది. నటుడు వైష్ణవ్‌ తేజ్‌, నటి కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవారి మొట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న బృందం... ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమలేశుని ఆశీస్సులు పొందింది. చిత్రం ప్రేక్షకాదరణ పొందిన ఆనందంతో.. మొక్కులు చెల్లించుకున్నామని వారు తెలిపారు.

తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్​​తో పాటు శాస్త్రవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగించనున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులను పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజల నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు వేదాశీర్వచనం చేసి... తీర్థప్రసాదాలు అందజేశారు. అమోజానియా-1తో పాటు మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు.

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్, ఉప్పెన చిత్ర బృందం

శ్రీనివాసుడికి ఉప్పెన బృందం కృతజ్ఞతలు

వెంకన్నకు ఉప్పెన చిత్ర బృందం ప్రత్యేక పూజలు చేసింది. నటుడు వైష్ణవ్‌ తేజ్‌, నటి కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవారి మొట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న బృందం... ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమలేశుని ఆశీస్సులు పొందింది. చిత్రం ప్రేక్షకాదరణ పొందిన ఆనందంతో.. మొక్కులు చెల్లించుకున్నామని వారు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.