ప్రతి మహిళా ఆర్థిక ప్రణాళిక నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఓ హోటల్ల్లో ఇండియన్ డైరెక్ట్ సీలింగ్ అసోసియేషన్, హెప్ప్ సేవా సంస్థల ఆధ్వర్యంలో మహిళా వ్యాపార వేత్తలు, సమాజ సేవకులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
మహిళలు విద్యతో పాటు సామాజిక అవగాహన అనుభవాలతో విభిన్న రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి టి.శ్రీదేవి తెలిపారు. వ్యాపార రంగాల్లో రాణిస్తోన్న మహిళలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు.
ఇదీ చూదవండి: అందాల వారసురాళ్లు.. మనసు దోచిన హీరోయిన్లు