ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం నిన్నటి నుంచి భారత్- యూకే మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి లండన్లోని హీత్రో విమానాశ్రయానికి ఉదయం సుమారు 7.50 గంటలకు బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన (బీఏ 276) బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ బయలుదేరింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఊతం ఇస్తుంది.
టెర్మినల్లోనికి ప్రవేశించడానికి ముందే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా నిర్వహించే థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలు సహా అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరిచారు. హైదరాబాద్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రతి వారం నాలుగు సర్వీసులను నిర్వహిస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలలో ఉంటాయని తెలిపారు. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి లండన్కు టికెట్టును బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఈ చర్యలతో ప్రయాణికులు ఇరు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వారిని కలసుకునేందుకు వెసుబాటు కలిగించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.