ETV Bharat / city

రూ.పది టికెట్ కొని ప్రాణాలు తీసుకుంటున్నారు..

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్లు సూసైడ్ స్పాట్లుగా మారుతున్నాయి. మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడటం ఇటీవల ఎక్కువగా జరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువతి మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో గర్భిణి దూకేందుకు ప్రయత్నించగా సిబ్బంది రక్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేషన్ ప్లాట్‌ఫాంపై భద్రతా చర్యల విషయంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

author img

By

Published : Apr 7, 2022, 9:04 AM IST

Updated : Apr 7, 2022, 9:44 AM IST

Hyderabad Metro
Hyderabad Metro

Hyderabad Metro : మెట్రోరైలు స్టేషన్లు సూసైడ్‌ స్పాట్స్‌గా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈఎస్‌ఐ స్టేషన్‌ ప్లాట్‌ఫాం పైనుంచి మంగళవారం యువతి దూకి ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం ఎస్‌ఆర్‌నగర్‌ స్టేషన్‌ పైనుంచి ఓ గర్భిణి దూకేందుకు యత్నించగా చివరి నిమిషంలో రక్షించారు. పది రూపాయల టికెట్‌ కొని ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై భదత్రా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు ‘ఈనాడు’ పరిశీలనలో కన్పించింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ నిఘా నిరుపయోగంగా మారుతోంది.

ఎర్రగడ్డ స్టేషన్‌ పైనుంచి దూకుతున్న యువతి (సీసీ ఫుటేజీ దృశ్యం)
  • కొవిడ్‌ తర్వాత నష్టాల పేరుతో భద్రతా, ఇతరత్రా సిబ్బందిలో కోత విధించడంతో ప్రయాణికుల కదలికలపై నిఘా కరవైంది.
  • కొవిడ్‌కు ముందు ప్రతి స్టేషన్‌లో ఇరువైపులా ఫ్లాట్‌ఫాంలపై భద్రతా సిబ్బంది ఉండేవారు. బుధవారం పలు స్టేషన్లను పరిశీలించగా రద్దీ ఎక్కువగా ఉండే అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో తప్ప మిగతా స్టేషన్లలోని ప్లాట్‌ఫాంలపై భద్రతా సిబ్బంది కన్పించలేదు.
  • ఫ్లాట్‌ఫాంను మెట్రోరైలు 6 కోచ్‌లను దృష్టిలో పెట్టుకుని కట్టారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. సగం ఫ్లాట్‌ఫాం ఖాళీగా ఉండటంతో ప్రయాణికులు ఫ్లాట్‌ఫాం చివరిదాకా వెళ్లి రోడ్డుమీదకు దూకేస్తున్నారు.
  • టిక్కెట్ల జారీపై తప్ప సీసీకెమెరాల్లో పరిశీలించి అనుమానాస్పదంగా సంచరించేవాళ్లను హెచ్చరించే సమయం లేకుండాపోయింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని అఘాయి త్యాలకు పాల్పడుతున్నారు.

ఎలక్ట్రానిక్‌ నిఘా ఏమైనట్లు? : సిబ్బంది లేకపోయినా నిఘాకు ఢోకా లేకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్స్‌ సర్వైలెన్స్‌ను స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌ఫాంలపై రెండువైపులా కలిపి 14చోట్ల సీసీకెమెరాల నిఘా ఉంది. కెమెరాల సంఖ్య 20 వరకుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థలు నిద్దురపోతున్నట్లు ఉందనే విమర్శలు వస్తున్నాయి.

తనిఖీల్లోనూ లోపాలు : మెట్రోరైలు పోలీసులు, ఎల్‌అండ్‌టీ అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఈఎస్‌ఐ స్టేషన్‌తోపాటూ పలు స్టేషన్లను పరిశీలించి భద్రతాలోపాలు గుర్తించారు. మంగళవారం జరిగిన ఆత్మహత్య ఘటనపై ఆరా తీశారు.

మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకబోయిన గర్భిణి.. రక్షించిన సిబ్బంది : ఎస్సార్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి బుధవారం ఓ గర్భిణి దూకబోగా సిబ్బంది అప్రమత్తమై రక్షించారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డకు చెందిన గర్భిణి మహిళ(25) భర్తతో గొడవపడి బుధవారం ఉదయం ఎస్సార్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ చేరుకుంది. స్టేషన్‌ ఫ్లాట్‌ఫాం పైకి చేరుకున్న మహిళ తన భర్తకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఈ విషయం అక్కడే ఉండి గమనించిన మెట్రో సిబ్బంది బాధితురాలిని రక్షించి ఎస్సార్‌నగర్‌ ఠాణాకు తీసుకొచ్చారు. పోలీసులు బాధితురాలికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

Hyderabad Metro : మెట్రోరైలు స్టేషన్లు సూసైడ్‌ స్పాట్స్‌గా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈఎస్‌ఐ స్టేషన్‌ ప్లాట్‌ఫాం పైనుంచి మంగళవారం యువతి దూకి ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం ఎస్‌ఆర్‌నగర్‌ స్టేషన్‌ పైనుంచి ఓ గర్భిణి దూకేందుకు యత్నించగా చివరి నిమిషంలో రక్షించారు. పది రూపాయల టికెట్‌ కొని ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై భదత్రా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు ‘ఈనాడు’ పరిశీలనలో కన్పించింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ నిఘా నిరుపయోగంగా మారుతోంది.

ఎర్రగడ్డ స్టేషన్‌ పైనుంచి దూకుతున్న యువతి (సీసీ ఫుటేజీ దృశ్యం)
  • కొవిడ్‌ తర్వాత నష్టాల పేరుతో భద్రతా, ఇతరత్రా సిబ్బందిలో కోత విధించడంతో ప్రయాణికుల కదలికలపై నిఘా కరవైంది.
  • కొవిడ్‌కు ముందు ప్రతి స్టేషన్‌లో ఇరువైపులా ఫ్లాట్‌ఫాంలపై భద్రతా సిబ్బంది ఉండేవారు. బుధవారం పలు స్టేషన్లను పరిశీలించగా రద్దీ ఎక్కువగా ఉండే అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో తప్ప మిగతా స్టేషన్లలోని ప్లాట్‌ఫాంలపై భద్రతా సిబ్బంది కన్పించలేదు.
  • ఫ్లాట్‌ఫాంను మెట్రోరైలు 6 కోచ్‌లను దృష్టిలో పెట్టుకుని కట్టారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. సగం ఫ్లాట్‌ఫాం ఖాళీగా ఉండటంతో ప్రయాణికులు ఫ్లాట్‌ఫాం చివరిదాకా వెళ్లి రోడ్డుమీదకు దూకేస్తున్నారు.
  • టిక్కెట్ల జారీపై తప్ప సీసీకెమెరాల్లో పరిశీలించి అనుమానాస్పదంగా సంచరించేవాళ్లను హెచ్చరించే సమయం లేకుండాపోయింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని అఘాయి త్యాలకు పాల్పడుతున్నారు.

ఎలక్ట్రానిక్‌ నిఘా ఏమైనట్లు? : సిబ్బంది లేకపోయినా నిఘాకు ఢోకా లేకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్స్‌ సర్వైలెన్స్‌ను స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌ఫాంలపై రెండువైపులా కలిపి 14చోట్ల సీసీకెమెరాల నిఘా ఉంది. కెమెరాల సంఖ్య 20 వరకుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థలు నిద్దురపోతున్నట్లు ఉందనే విమర్శలు వస్తున్నాయి.

తనిఖీల్లోనూ లోపాలు : మెట్రోరైలు పోలీసులు, ఎల్‌అండ్‌టీ అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఈఎస్‌ఐ స్టేషన్‌తోపాటూ పలు స్టేషన్లను పరిశీలించి భద్రతాలోపాలు గుర్తించారు. మంగళవారం జరిగిన ఆత్మహత్య ఘటనపై ఆరా తీశారు.

మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకబోయిన గర్భిణి.. రక్షించిన సిబ్బంది : ఎస్సార్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి బుధవారం ఓ గర్భిణి దూకబోగా సిబ్బంది అప్రమత్తమై రక్షించారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డకు చెందిన గర్భిణి మహిళ(25) భర్తతో గొడవపడి బుధవారం ఉదయం ఎస్సార్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ చేరుకుంది. స్టేషన్‌ ఫ్లాట్‌ఫాం పైకి చేరుకున్న మహిళ తన భర్తకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఈ విషయం అక్కడే ఉండి గమనించిన మెట్రో సిబ్బంది బాధితురాలిని రక్షించి ఎస్సార్‌నగర్‌ ఠాణాకు తీసుకొచ్చారు. పోలీసులు బాధితురాలికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

Last Updated : Apr 7, 2022, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.