ETV Bharat / city

కరోనా నుంచి తల్లీ, బిడ్డలను ఆదుకున్న 'గాంధీ'

author img

By

Published : Jan 8, 2021, 12:05 PM IST

ఎంత కష్టం వచ్చినా.. ఎన్ని అనారోగ్య ఇబ్బందులు ఎదురైనా.. ఆ బాధంతా పంటి బిగువున భరించి శిశువును ఈ భూమి పైకి తెస్తుంది అమ్మ. పుట్టిన బిడ్డను ఒక్కసారి చేతిలోకి తీసుకున్నాక.. ఆ కష్టమంతా మర్చిపోతుంది. కడుపులో బిడ్డను పెట్టుకొని, కరోనా బారిన పడిన గర్భిణులు.. ఎంతో ధైర్యంతో మహమ్మారిని ఎదురించి నిలిచారు. అలాంటి ఎంతోమంది గర్భిణులకు గాంధీ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పురుడు పోశారు.

Hyderabad gandhi hospital cares mother and child from Corona from march 2020
కరోనా నుంచి తల్లీ, బిడ్డలను ఆదుకున్న గాంధీ

తొలి కరోనా కేసు నమోదైన గతేడాది మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 1,256 మంది గర్భిణులకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. నెలవారీ పరీక్షలు, ఇతర సంప్రదింపుల కోసం ఆసుపత్రులకు వెళ్లిన ఎంతోమంది గర్భిణులు కరోనా బారినపడ్డారు. ఇందులో నెలలు నిండిన వారూ ఉన్నారు. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరినవారికీ కరోనా సోకింది. తొలినాళ్లలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు అందుబాటులో లేక అన్ని జిల్లాల నుంచి గాంధీకు తరలించారు. కరోనా చికిత్సతోపాటు నెలలు నిండిన వెంటనే ప్రసవం పోశారు.

శిశువులకు సోకకుండా..

తల్లికి కరోనా వస్తే బిడ్డకూ ప్రమాదమే. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పుట్టిన బిడ్డకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నామని గాంధీ వైద్యులు తెలిపారు. నిలోఫర్‌ ఇతర బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కేంద్రాల సాయంతో బయట నుంచి తల్లి పాలు తెప్పించి వారికి అందించారు. ఈ క్రమంలో చికిత్సలు అందించే వైద్యులకూ కరోనా సోకింది. గైనకాలజీలో దాదాపు 10 మంది పీజీ వైద్య విద్యార్థులకు గతంలో కరోనా సోకింది. అయినా వెరవకుండా ఎంతోమంది తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడారు.

Hyderabad gandhi hospital cares mother and child from Corona from march 2020
కరోనా సమయంలో గాంధీలో ప్రసవాలు ఇలా...

పెద్ద సవాలే:

కరోనా తొలినాళ్లలో సవాలుగా స్వీకరించాం. చికిత్సల ప్రొటోకాల్‌ పాటిస్తూనే గర్భిణులకు ప్రసవాలు చేశాం. సంక్లిష్ట పరిస్థితిలో వచ్చిన ఎంతోమంది ప్రాణాలు కాపాడాం. కొన్నిసార్లు తల్లి ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన నుంచి ప్రసవం వరకు చాలా కీలకం. ప్రైవేటు ఆసుపత్రుల్లో తిరస్కరించిన కొన్ని కేసుల్లో పురుడు పోసి సంతోషంగా పంపాం.

-డాక్టర్‌ జానకి వెల్లంకి, సహాయ ఆచార్యులు, గాంధీ ఆసుపత్రి

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు, 2 మరణాలు

తొలి కరోనా కేసు నమోదైన గతేడాది మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 1,256 మంది గర్భిణులకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. నెలవారీ పరీక్షలు, ఇతర సంప్రదింపుల కోసం ఆసుపత్రులకు వెళ్లిన ఎంతోమంది గర్భిణులు కరోనా బారినపడ్డారు. ఇందులో నెలలు నిండిన వారూ ఉన్నారు. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరినవారికీ కరోనా సోకింది. తొలినాళ్లలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు అందుబాటులో లేక అన్ని జిల్లాల నుంచి గాంధీకు తరలించారు. కరోనా చికిత్సతోపాటు నెలలు నిండిన వెంటనే ప్రసవం పోశారు.

శిశువులకు సోకకుండా..

తల్లికి కరోనా వస్తే బిడ్డకూ ప్రమాదమే. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పుట్టిన బిడ్డకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నామని గాంధీ వైద్యులు తెలిపారు. నిలోఫర్‌ ఇతర బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కేంద్రాల సాయంతో బయట నుంచి తల్లి పాలు తెప్పించి వారికి అందించారు. ఈ క్రమంలో చికిత్సలు అందించే వైద్యులకూ కరోనా సోకింది. గైనకాలజీలో దాదాపు 10 మంది పీజీ వైద్య విద్యార్థులకు గతంలో కరోనా సోకింది. అయినా వెరవకుండా ఎంతోమంది తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడారు.

Hyderabad gandhi hospital cares mother and child from Corona from march 2020
కరోనా సమయంలో గాంధీలో ప్రసవాలు ఇలా...

పెద్ద సవాలే:

కరోనా తొలినాళ్లలో సవాలుగా స్వీకరించాం. చికిత్సల ప్రొటోకాల్‌ పాటిస్తూనే గర్భిణులకు ప్రసవాలు చేశాం. సంక్లిష్ట పరిస్థితిలో వచ్చిన ఎంతోమంది ప్రాణాలు కాపాడాం. కొన్నిసార్లు తల్లి ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన నుంచి ప్రసవం వరకు చాలా కీలకం. ప్రైవేటు ఆసుపత్రుల్లో తిరస్కరించిన కొన్ని కేసుల్లో పురుడు పోసి సంతోషంగా పంపాం.

-డాక్టర్‌ జానకి వెల్లంకి, సహాయ ఆచార్యులు, గాంధీ ఆసుపత్రి

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు, 2 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.