ETV Bharat / city

ప్రభుత్వం ఏదో దాస్తోంది.. ఆ అక్రమ తవ్వకాల విచారణలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

author img

By

Published : Oct 13, 2022, 4:59 PM IST

High Court on Rushikonda: విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తోందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని పంపుతామని స్పష్టం చేసింది. కమిటీ వేస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అఫిడవిట్ వేసిన తర్వాత వాస్తవాలు తేలుస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

High Court
High Court

High Court on Rushikonda: ఏపీలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను కొట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో విభిన్న వైఖరులేంటని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని పంపుతామని స్పష్టం చేసింది. కమిటీ వేస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గూగుల్ మ్యాప్‌లను అందించారు. 9.88 ఎకరాలకే తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్ మ్యాప్‌లు అబద్ధాలు చెబుతాయా అని హైకోర్టు సీజే ప్రశ్నించారు. ఆఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోరారు. అఫిడవిట్ వేసిన తర్వాత వాస్తవాలు తేలుస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణ నవంబర్ 3కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

High Court on Rushikonda: ఏపీలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను కొట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో విభిన్న వైఖరులేంటని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని పంపుతామని స్పష్టం చేసింది. కమిటీ వేస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గూగుల్ మ్యాప్‌లను అందించారు. 9.88 ఎకరాలకే తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్ మ్యాప్‌లు అబద్ధాలు చెబుతాయా అని హైకోర్టు సీజే ప్రశ్నించారు. ఆఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోరారు. అఫిడవిట్ వేసిన తర్వాత వాస్తవాలు తేలుస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణ నవంబర్ 3కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.