ETV Bharat / city

Tirumala Rains: తిరుమల గిరుల్లో భయోత్పాతం.. ఎక్కడ చూసినా జలబీభత్సం

author img

By

Published : Nov 19, 2021, 5:03 AM IST

కుండపోత వర్షంతో ఏపీలోని తిరుమల ఆలయ పరిసరాలు నీట మునిగాయి. కనుమదారుల్లో వరద నీరు జలపాతాలను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే కొండపైన ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

heavy-rains-in-tirumala
heavy-rains-in-tirumala
తిరుమల గిరుల్లో భయోత్పాతం.. ఎక్కడ చూసినా జలబీభత్సం

కుండపోత వర్షంతో ఏపీ చిత్తూరు జిల్లా (chittoor district)లోని తిరుమల( heavy rains in tirumala) గిరులు భయోత్పాతాన్ని సృష్టించాయి. ఆలయ పరిసరాలన్నీ వరద నీటి(flood water) తో నిండిపోయాయి. మాడవీధులన్నీ వాగులను తలపించాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుమల (tirumala) పరిస్థితులు భీతావహమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోకి నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది.

విరిగిపడిన కొండచరియలు..

కనుమదారుల్లో వరద నీరు జలపాతాల (Waterfalls) మాదిరిగా పడుతుండటంతో కొండచరియలు ( landslides Broken ) విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు పడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే (ttd)... శుక్ర,శనివారాలు సైతం అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి.

వర్షం తగ్గాకే భక్తులకు అనుమతి ..

పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం తితిదే (ttd) మూసివేసింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది. కండపోత వర్షానికి (heavy rain) టూరిజం హోటల్ ప్రహరీగోడ కూలి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. శిథిలాల కింద నారాయణ అనే కార్మికుడి కాలు ఇరుక్కుపోవడంతో కట్టర్లతో ఇనుపకడ్డీలు కత్తిరించి అతికష్టం మీద బయటకు తీశారు.

తిరుమల రావొద్దు

భక్తులు ఎవరూ తిరుమల (tirumala) రావొద్దని అధికారులు ఆదేశించారు. గురు,శుక్రవారాల్లో దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులకు వర్షం తీవ్రత తగ్గిన తర్వాత దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

జలపాతంలా మెట్ల మార్గం..

తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు( heavy rains in tirumala) అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద... మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే.. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో క‌పిలేశ్వరాల‌యం వద్ద జలపాతం జోరుమీదుంది.

ఇదీ చూడండి:

తిరుమల గిరుల్లో భయోత్పాతం.. ఎక్కడ చూసినా జలబీభత్సం

కుండపోత వర్షంతో ఏపీ చిత్తూరు జిల్లా (chittoor district)లోని తిరుమల( heavy rains in tirumala) గిరులు భయోత్పాతాన్ని సృష్టించాయి. ఆలయ పరిసరాలన్నీ వరద నీటి(flood water) తో నిండిపోయాయి. మాడవీధులన్నీ వాగులను తలపించాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుమల (tirumala) పరిస్థితులు భీతావహమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోకి నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది.

విరిగిపడిన కొండచరియలు..

కనుమదారుల్లో వరద నీరు జలపాతాల (Waterfalls) మాదిరిగా పడుతుండటంతో కొండచరియలు ( landslides Broken ) విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు పడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే (ttd)... శుక్ర,శనివారాలు సైతం అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి.

వర్షం తగ్గాకే భక్తులకు అనుమతి ..

పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం తితిదే (ttd) మూసివేసింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది. కండపోత వర్షానికి (heavy rain) టూరిజం హోటల్ ప్రహరీగోడ కూలి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. శిథిలాల కింద నారాయణ అనే కార్మికుడి కాలు ఇరుక్కుపోవడంతో కట్టర్లతో ఇనుపకడ్డీలు కత్తిరించి అతికష్టం మీద బయటకు తీశారు.

తిరుమల రావొద్దు

భక్తులు ఎవరూ తిరుమల (tirumala) రావొద్దని అధికారులు ఆదేశించారు. గురు,శుక్రవారాల్లో దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులకు వర్షం తీవ్రత తగ్గిన తర్వాత దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

జలపాతంలా మెట్ల మార్గం..

తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు( heavy rains in tirumala) అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద... మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే.. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో క‌పిలేశ్వరాల‌యం వద్ద జలపాతం జోరుమీదుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.