ETV Bharat / city

రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు

author img

By

Published : Nov 7, 2020, 8:43 AM IST

దేశంలోనే మొదటి సారి రాష్ట్రంలో గురుకుల న్యాయ కళాశాలలు రాబోతున్నాయి. ఎస్సీ బాలికల, ఎస్టీ అబ్బాయిల బాలుర గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటుకు సొసైటీలు కసరత్తు చేస్తున్నాయి. కనీసం ఒక కళాశాల ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎల్ఎల్ఎంలో రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు
రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు

రాష్ట్రంలో త్వరలోనే ఎస్సీ, ఎస్టీ గురుకుల న్యాయ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఇంటర్ బాలికల కోసం న్యాయ కళాశాల ఏర్పాటుకు ఎస్సీ గురుకుల సొసైటీ సన్నాహాలు చేస్తోంది. ఘట్​కేసర్​లో బాలికలకు ఐదేళ్ల బీఏ- ఎల్ఎల్​బీ కాలేజీ ఏర్పాటు కోసం ఎస్సీ గురుకుల సొసైటీ దరఖాస్తు చేసుకుంది. ఇంటర్ విద్యార్హతతో తెలంగాణ లాసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

నలభై సీట్లతో కళాశాల కోసం ఎస్సీ గురుకుల సొసైటీ చేసిన దరఖాస్తుకు బార్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ప్రక్రియ పూర్తయినట్లు లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరమే కళాశాల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సంగారెడ్డిలో బాలుర ఐదేళ్ల బీఏ-ఎల్ఎల్​బీ గురుకుల కాలేజీ కోసం ఎస్టీ గురుకుల సొసైటీ దరఖాస్తు చేసుకుంది. నలభై సీట్లతో ఈ కాలేజీ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్హతతో తెలంగాణ లాసెట్ ర్యాంకులు, కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎల్ఎల్ఎంలో రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ సిస్టంతో పాటు మానవ హక్కుల చట్టాలు అనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశ పెట్టినట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో త్వరలోనే ఎస్సీ, ఎస్టీ గురుకుల న్యాయ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఇంటర్ బాలికల కోసం న్యాయ కళాశాల ఏర్పాటుకు ఎస్సీ గురుకుల సొసైటీ సన్నాహాలు చేస్తోంది. ఘట్​కేసర్​లో బాలికలకు ఐదేళ్ల బీఏ- ఎల్ఎల్​బీ కాలేజీ ఏర్పాటు కోసం ఎస్సీ గురుకుల సొసైటీ దరఖాస్తు చేసుకుంది. ఇంటర్ విద్యార్హతతో తెలంగాణ లాసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

నలభై సీట్లతో కళాశాల కోసం ఎస్సీ గురుకుల సొసైటీ చేసిన దరఖాస్తుకు బార్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ప్రక్రియ పూర్తయినట్లు లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరమే కళాశాల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సంగారెడ్డిలో బాలుర ఐదేళ్ల బీఏ-ఎల్ఎల్​బీ గురుకుల కాలేజీ కోసం ఎస్టీ గురుకుల సొసైటీ దరఖాస్తు చేసుకుంది. నలభై సీట్లతో ఈ కాలేజీ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్హతతో తెలంగాణ లాసెట్ ర్యాంకులు, కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎల్ఎల్ఎంలో రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ సిస్టంతో పాటు మానవ హక్కుల చట్టాలు అనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశ పెట్టినట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.