ఇవీ చూడండి: నేడు 'మకర జ్యోతి' దర్శనం.. భద్రత కట్టుదిట్టం
గుంటూరులో సామూహిక అత్యాచారం..యువతి మృతి - girl gets raped and dead at guntur district news
గుంటూరు జిల్లాలో ముగ్గురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జిల్లాలోని వెల్దుర్తి మండలంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబరు 24న ఆమె మండలంలోని ఓ గ్రామంలో శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనారోగ్యానికి గురవటంతో బాధితురాలిని మాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం బాధితురాలు మృతి చెందింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
![గుంటూరులో సామూహిక అత్యాచారం..యువతి మృతి RAPE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5714374-897-5714374-1579038390544.jpg?imwidth=3840)
గుంటూరులో సామూహిక అత్యాచారం..యువతి మృతి
ఇవీ చూడండి: నేడు 'మకర జ్యోతి' దర్శనం.. భద్రత కట్టుదిట్టం
Last Updated : Jan 15, 2020, 11:46 AM IST