ETV Bharat / city

టీఆర్ఎస్ బేగంబజార్​ను పట్టించుకోలేదు: పురుషోత్తం

బేగంబజార్ అభివృద్ధికి టీఆర్​ఎస్ సర్కారు పనిచేసిన దాఖలా లేదని బేగంబజార్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పురుషోత్తం ఆరోపించారు. తనను గెలిపిస్తే ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న పార్కింగ్ సమస్య పరిష్కరిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ghmc-begumbazar-congress-contestant-purushotham-byte
begumbazar-congress-contestant-purushotham
author img

By

Published : Nov 23, 2020, 2:01 PM IST

బేగంబజార్ ప్రాంతం గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదని బేగంబజార్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పురుషోత్తం ఆరోపించారు. మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ సమస్యతో పాటు నాలా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, పురపాలక మంత్రి కేటీఆర్ బేగంబజార్​ను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఒక్కరికీ కేటాయించలేదన్నారు. ఒక్కసారి ప్రజలు తనకు అవకాశమిచ్చి కాంగ్రెస్​ను గెలిపిస్తే బేగంబజార్ మార్కెట్​ను మోడల్ మార్కెట్​గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

టీఆర్ఎస్ బేగంబజార్​ను పట్టించుకోలేదు: పురుషోత్తం

బేగంబజార్ ప్రాంతం గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదని బేగంబజార్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పురుషోత్తం ఆరోపించారు. మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ సమస్యతో పాటు నాలా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, పురపాలక మంత్రి కేటీఆర్ బేగంబజార్​ను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఒక్కరికీ కేటాయించలేదన్నారు. ఒక్కసారి ప్రజలు తనకు అవకాశమిచ్చి కాంగ్రెస్​ను గెలిపిస్తే బేగంబజార్ మార్కెట్​ను మోడల్ మార్కెట్​గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

టీఆర్ఎస్ బేగంబజార్​ను పట్టించుకోలేదు: పురుషోత్తం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.