ETV Bharat / city

'సుసంపన్న దేశాన్ని సృష్టించటంలో బాపు ఆదర్శాలే మార్గనిదేశాలు'

author img

By

Published : Oct 2, 2020, 6:14 PM IST

రాచకొండ సీపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి సీపీ మహేశ్​ భగవత్​ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ ఆలోచనలే మన మార్గదర్శకాలని సీపీ తెలిపారు.

gandhi jayanthi at eachakonda cp office
gandhi jayanthi at eachakonda cp office

మేడ్చల్ జిల్లా నేరెడ్​మెట్ రాచకొండ సీపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి సీపీ మహేశ్​ భగవత్​ నివాళులు అర్పించారు. తన జీవితం, గొప్ప ఆలోచనల నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని సీపీ తెలిపారు.

సుసంపన్న భారతదేశాన్ని సృష్టించడంలో బాపు ఆదర్శాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయని... బాపు విధాన విషయాలపై తెలివైన అవగాహన మన దేశానికి గొప్ప ఆస్తులని కొనియాడారు. బలహీనంగా ఉన్నవారికి సేవ చేయడం పట్ల గాంధీ చాలా కరుణ కలిగి ఉండేవాడని... పాఠశాల విద్యార్థులకు సీపీ బోధించారు.

ఇదీ చూడండి: 'ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి'

మేడ్చల్ జిల్లా నేరెడ్​మెట్ రాచకొండ సీపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి సీపీ మహేశ్​ భగవత్​ నివాళులు అర్పించారు. తన జీవితం, గొప్ప ఆలోచనల నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని సీపీ తెలిపారు.

సుసంపన్న భారతదేశాన్ని సృష్టించడంలో బాపు ఆదర్శాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయని... బాపు విధాన విషయాలపై తెలివైన అవగాహన మన దేశానికి గొప్ప ఆస్తులని కొనియాడారు. బలహీనంగా ఉన్నవారికి సేవ చేయడం పట్ల గాంధీ చాలా కరుణ కలిగి ఉండేవాడని... పాఠశాల విద్యార్థులకు సీపీ బోధించారు.

ఇదీ చూడండి: 'ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.