గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులను తక్షణమే చేర్చుకోవాలని సూపరింటెండెంట్ రాజారావు వివిధ భాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీపీసీఆర్ రిపోర్టు కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. కొవిడ్ రోగులను తీసుకొచ్చే అంబులెన్స్లను ఆపొద్దని పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులను రిపోర్టుల పేరుతో ఒత్తిడి చేయకుండా తక్షణమే చేర్చుకోవాలని సూపరింటెండెంట్ ఆదేశించారు.