ETV Bharat / city

మెట్రోస్టేషన్లలో వైఫై: ఇకపై డాటా లేకుండానే అంతర్జాల సేవలు

author img

By

Published : Dec 10, 2019, 12:38 PM IST

Updated : Dec 10, 2019, 1:52 PM IST

wifi in hyderabad metro
హైదరాబాద్​ మెట్రో స్టేషన్లలో ​ వై-ఫై సేవలు

12:32 December 10

.

హైదరాబాద్​ మెట్రో స్టేషన్లలో షుగర్​ బాక్స్​ మెట్రో లోకల్​ వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి షుగర్​ బాక్స్​ నెట్​వర్క్​ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా మొబైల్​ డాటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది.

మొదటగా 10 మెట్రో స్టేషన్లలో షుగర్​ బాక్స్​ వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్​లలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ నెట్​వర్క్​ ద్వారా మూడు నిమిషాల్లో సినిమా డౌన్​లోడ్​ చేసుకోవచ్చని ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన  అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

షుగర్​ బాక్స్​ వై-ఫై సేవలను 60 రోజుల వరకు ఉచితంగా అందిస్తామని ఆ సంస్థ సీఈవో రోహిత్​ తెలిపారు. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతిరోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరమని రోహిత్​ అన్నారు. గేమింగ్​, ఫుడ్​, ఈ-కామర్స్, ఈ-లెర్నింగ్​ వంటివి కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. 

12:32 December 10

.

హైదరాబాద్​ మెట్రో స్టేషన్లలో షుగర్​ బాక్స్​ మెట్రో లోకల్​ వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి షుగర్​ బాక్స్​ నెట్​వర్క్​ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా మొబైల్​ డాటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది.

మొదటగా 10 మెట్రో స్టేషన్లలో షుగర్​ బాక్స్​ వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్​లలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ నెట్​వర్క్​ ద్వారా మూడు నిమిషాల్లో సినిమా డౌన్​లోడ్​ చేసుకోవచ్చని ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన  అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

షుగర్​ బాక్స్​ వై-ఫై సేవలను 60 రోజుల వరకు ఉచితంగా అందిస్తామని ఆ సంస్థ సీఈవో రోహిత్​ తెలిపారు. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతిరోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరమని రోహిత్​ అన్నారు. గేమింగ్​, ఫుడ్​, ఈ-కామర్స్, ఈ-లెర్నింగ్​ వంటివి కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. 

Rampur (Uttar Pradesh), Dec 10 (ANI): The Lok Sabha had passed the Citizenship Amendment Bill, 2019 on December 09. While speaking on the same, Samajwadi Party (SP) leader Azam Khan said that the decision of Citizenship Amendment Bill, 2019 has been taken on the basis of strength. He said, "The number of Opposition is low so no matter how right Opposition is, no one will listen to them. But a good democracy says that ruling party should not only listen to the Opposition but also must agree to them, if they are right. The question on which the country is divided today was the same thing on which it was divided in 1947."
Last Updated : Dec 10, 2019, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.