మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు... తెలుగు వారి సత్తా ఏంటో నిరూపించారని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో మాదాపూర్ చిత్రమయీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో... 'మెనీ ఫేసెస్ ఆఫ్ ఏ మాస్టర్' పేరుతో నిర్వహించిన ఫొటో ప్రదర్శనను స్పీకర్ ప్రారంభించారు.
సంస్కరణలతో దేశాన్ని పాలించి... ప్రజలకు సత్ఫలితాలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశానికి స్ఫూర్తిదాయకమైన పాలన అందించిన పీవీ... వ్యక్తి కాదు ఆయనో శక్తి అని వ్యాఖ్యానించారు. పీవీపై ఓ పుస్తకం తీసుకురావాలని అనుకుంటున్నట్టు... ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ