మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ హైదరాబాద్ లోని అనిశా కోర్టుకు హాజరయ్యారు. మోపిదేవి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మద్యం వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్లు అనిశా అధికారులు అభియోగం మోపారు.
ఈ కేసులో ఇతర నిందితులపై కూడా అనిశా అభియోగాలు నమోదు చేసింది. షెడ్యూలు ఖరారు చేసిన ఏసీబీ న్యాయస్థానం.. ఈనెల 19 నుంచి విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి : హైదరాబాద్లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం