ETV Bharat / city

అల్లూరి 125వ జయంతి.. భీమవరంలో విగ్రహావిష్కరణ చేయనున్న ప్రధాని

author img

By

Published : Jul 4, 2022, 9:27 AM IST

Alluri 125th Birth Anniversary: మన్యం వీరుడు, విప్లవ నిప్పుకణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్​లో భాగంగా విప్లవ వీరుడి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు అల్లూరి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి , పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అల్లూరి 125వ జయంతి ఉత్సవ కమిటీ ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేసింది.

PM Modi unveils Alluri Sitarama raju idol
PM Modi unveils Alluri Sitarama raju idol

Alluri 125th Birth Anniversary: విప్లవజ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 125వ జయంత్యుత్సవాల ప్రారంభ వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తగు ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.

అల్లూరి విగ్రహ ప్రాంగణంలో..
భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఫ్లెక్సీల్లో అల్లూరి చిత్రాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిత్రాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణాన్ని ఆకట్టుకునే రీతిలో పుష్పవనంలా తీర్చిదిద్దారు.

..

వేదికపై 11 మందికే అవకాశం.. ప్రధాన వేదికపై 11 మందికే అవకాశం కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు మరో ఏడుగురే ఉంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10.50 నుంచి 12.30 మధ్య ప్రసంగాలుంటాయి. ఇదే ప్రాంగణం నుంచి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని వర్చువల్‌గా ఆవిష్కరిస్తారు.

బహిరంగ సభ వేదికకు ఎదురుగా ఓ వైపు మహిళలకు, మరోవైపు పురుషులకు ప్రత్యేకంగా 500 మంది చొప్పున పట్టేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కోవైపు ఐదేసి చొప్పున భారీ స్క్రీన్లను పెట్టారు. వర్షం కురిసినా తట్టుకునేలా షామియానాలతో పాటు.. ఎండ తీవ్రత పెరిగినా ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. వేదిక ఎదురుగా 50 వేల మందికి కుర్చీలను సిద్ధం చేశారు. అల్లూరి కుటుంబీకులు ఆసీనులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

వర్షంతో ఆటంకం.. ఆగమేఘాలపై ఏర్పాట్లు..

వర్షంతో ఆటంకం.. ఆగమేఘాలపై ఏర్పాట్లు.. అల్లూరి జయంత్యుత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తయినా.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన పరిస్థితి చక్కదిద్దే చర్యలు చేపట్టింది. నిలిచిన నీటిని మోటార్లతో తోడించడంతో పాటు.. లోతట్టు ప్రాంతాల్లో మట్టి పోశారు. బహిరంగ సభ చుట్టుపక్కల ప్రాంతాలు బురదమయం అయినా సాయంత్రానికి వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. రహదారులతో పాటు వాహనాలు నిలిపే ప్రాంగణాలన్నీ తీర్చిదిద్దారు.

సోమవారం వర్షం కురిసి, ప్రధాని హెలికాప్టర్‌లో రావడానికి ఒకవేళ ఇబ్బంది ఎదురైతే... రోడ్డు మార్గంలో రావడానికి వీలుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. నారాయణపురం నుంచి నిడమర్రు- గణపవరం- ఉండి వరకు రహదారి పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా ఉంది. దీంతో ఆయా గోతుల్లో మట్టి, రాళ్లు పోసి యంత్రాలతో ఆగమేఘాల మీద చదును చేయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కానున్న సీఎం జగన్‌.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి భీమవరం చేరుకుని ప్రధాని మోదీతో పాటు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25కు భీమవరం నుంచి బయల్దేరి 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధానికి వీడ్కోలు పలికి అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Alluri 125th Birth Anniversary: విప్లవజ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 125వ జయంత్యుత్సవాల ప్రారంభ వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తగు ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.

అల్లూరి విగ్రహ ప్రాంగణంలో..
భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఫ్లెక్సీల్లో అల్లూరి చిత్రాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిత్రాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణాన్ని ఆకట్టుకునే రీతిలో పుష్పవనంలా తీర్చిదిద్దారు.

..

వేదికపై 11 మందికే అవకాశం.. ప్రధాన వేదికపై 11 మందికే అవకాశం కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు మరో ఏడుగురే ఉంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10.50 నుంచి 12.30 మధ్య ప్రసంగాలుంటాయి. ఇదే ప్రాంగణం నుంచి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని వర్చువల్‌గా ఆవిష్కరిస్తారు.

బహిరంగ సభ వేదికకు ఎదురుగా ఓ వైపు మహిళలకు, మరోవైపు పురుషులకు ప్రత్యేకంగా 500 మంది చొప్పున పట్టేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కోవైపు ఐదేసి చొప్పున భారీ స్క్రీన్లను పెట్టారు. వర్షం కురిసినా తట్టుకునేలా షామియానాలతో పాటు.. ఎండ తీవ్రత పెరిగినా ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. వేదిక ఎదురుగా 50 వేల మందికి కుర్చీలను సిద్ధం చేశారు. అల్లూరి కుటుంబీకులు ఆసీనులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

వర్షంతో ఆటంకం.. ఆగమేఘాలపై ఏర్పాట్లు..

వర్షంతో ఆటంకం.. ఆగమేఘాలపై ఏర్పాట్లు.. అల్లూరి జయంత్యుత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తయినా.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన పరిస్థితి చక్కదిద్దే చర్యలు చేపట్టింది. నిలిచిన నీటిని మోటార్లతో తోడించడంతో పాటు.. లోతట్టు ప్రాంతాల్లో మట్టి పోశారు. బహిరంగ సభ చుట్టుపక్కల ప్రాంతాలు బురదమయం అయినా సాయంత్రానికి వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. రహదారులతో పాటు వాహనాలు నిలిపే ప్రాంగణాలన్నీ తీర్చిదిద్దారు.

సోమవారం వర్షం కురిసి, ప్రధాని హెలికాప్టర్‌లో రావడానికి ఒకవేళ ఇబ్బంది ఎదురైతే... రోడ్డు మార్గంలో రావడానికి వీలుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. నారాయణపురం నుంచి నిడమర్రు- గణపవరం- ఉండి వరకు రహదారి పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా ఉంది. దీంతో ఆయా గోతుల్లో మట్టి, రాళ్లు పోసి యంత్రాలతో ఆగమేఘాల మీద చదును చేయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కానున్న సీఎం జగన్‌.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి భీమవరం చేరుకుని ప్రధాని మోదీతో పాటు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25కు భీమవరం నుంచి బయల్దేరి 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధానికి వీడ్కోలు పలికి అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.