ETV Bharat / city

Yoga: రెండు కాళ్లు నుజ్జునుజ్జు.. యోగాతో కొత్త జీవితం

author img

By

Published : Jun 21, 2021, 2:35 PM IST

పట్టుదల ఉంటే... వైకల్యం ఉన్నా, పెళ్లయినా... పిల్లలు పుట్టినా, వయసు పైబడినా అనుకున్నది సాధించవచ్చు. అందుకు ఉదాహరణే ఈ ముగ్గురూ. యోగాతో సమస్యల్ని అధిగమించి, దాంతోనే ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, కీర్తి, సేవ... ఒకటేమిటి అన్నీ సాధిస్తున్నామంటున్న ముగ్గురు మగువల స్ఫూర్తి కథనాలివీ... యోగా దినోత్సవం సందర్భంగా ...

international yoga day special
అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కథనాలు

అర్పితా రాయ్‌ భవిష్యత్తు గురించి అందమైన కలలు కనేది. కానీ ఓ దుర్ఘటన తన జీవితాన్నే మార్చేసింది. ఆ కష్టాల్ని పంటిబిగువున భరించి...కుంగుబాటుని జయించింది. యోగా గురువుగా మారి ఇలా ఎదుర్కోవాలి జీవితాన్ని అని చూపిస్తోంది.

international yoga day special
ఆ ప్రయాణం స్ఫూర్తిదాయకం

అప్పుడు అర్పితకు 20 ఏళ్లు. 2006, ఏప్రిల్‌లో ఓరోజు బైక్‌లో వెళుతూ అదుపు తప్పి కిందపడిపోయింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లిపోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఎవరో ఆసుపత్రిలో చేర్చారు. ‘ప్రాణం నిలబడినా... రెండుకాళ్లు నుజ్జునుజ్జు అయిపోయాయి. ప్రాణాన్ని కాపాడటం కోసం కాళ్లను తొలగించాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నేను ఇకపై కనీసం అడుగులైనా వేయలేననే ఆలోచనే తీవ్రంగా కుంగదీసింది. నాలుగు నెలలు బెడ్‌ మీదే ఉండటంతో బెడ్‌సోర్స్‌ వచ్చాయి. ఆ బాధలన్నీ పంటి బిగువునే భరించా. ఇంటికి చేరుకున్నాక బంధువులు, తెలిసిన వారు ఏవేవో చెప్పే వారు. అవన్నీ నాపై తీవ్ర ప్రభావాన్ని చూపేవి. వీటన్నింటినీ దాటి, నన్ను నేను కాపాడుకోవాలనే ఆలోచన నాలో మొదలైంది. నాలాంటి వాళ్ల విజయాల గురించి చదవడం మొదలుపెట్టా’ అని గుర్తు చేసుకుంటుంది అర్పిత.

పదిసార్లకు పైగా విఫలమై...

వైద్యులు అర్పితకు కృత్రిమ కాళ్లను పెట్టారు. ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల తర్వాత మెల్లిగా అడుగులేయడం ప్రారంభించింది. ఫిజియోథెరపీతో పాటు యోగా కూడా చేసేది. అలా కొంత ఉపశమనం వచ్చిందామెకు. ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే తన వైకల్యం తెలియకుండా దుస్తులు ధరించి పోస్ట్‌ చేసేది. ఆ సమయంలో ఓ స్నేహితుడు ‘మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనలోని లోపాన్ని అంగీకరించడం నేర్చుకుంటేనే జీవితాన్ని జయించగలం’ అని చెప్పాడు. ఆ మాటలు తన దృక్పథాన్ని మార్చేశాయి. ‘నా ఫ్రెండ్‌ మాటలలో నా కృత్రిమ కాళ్లు తెలిసేలా యోగా భంగిమ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పెట్టా. అయితే ఏం వ్యాఖ్యలు వస్తాయో అనే భయంతో రోజంతా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశా. మరుసటి రోజు చూస్తే... ఎంతోమంది ప్రశంసించారు. వీరిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఇక అప్పటినుంచి ఆన్‌లైన్‌లో యోగా బోధిస్తున్నా. దేశవ్యాప్తంగా అయిదు వందల మందికిపైగా వీటికి హాజరవుతున్నారు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉండేందుకు బరువును తగ్గించుకున్నా. నేను నేర్పే ప్రతి వ్యాయామం కృత్రిమకాళ్లతో చేయడం కష్టం. పదిసార్లుకు పైగా విఫలమై, ఆ తర్వాతే శీర్షాసనం వేయగలిగా. నా విజయాన్నే కాదు, నా ఇబ్బందులు కూడా అందరికీ తెలియజేసేలా వీడియోలను పోస్ట్‌ చేస్తుంటా. అప్పుడే కదా... వైఫల్యం నుంచి విజయం ఎలా సాధించాలో తెలుస్తుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది. చాలా కాంటెస్ట్‌ల్లో విజేతగా నిలిచా. యోగా జర్నల్‌లో నా గురించి ప్రచురించడం మరవలేను. ఇవన్నీ నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూనే ఉన్నాయి’ అని చెబుతున్న అర్పితారాయ్‌ త్వరలో కృత్రిమ అవయవాల కేంద్రాలతో కలిసి పనిచేయనుంది. వికలాంగులకు కౌన్సిలింగ్‌తో ఆత్మవిశ్వాసాన్ని అందించాలనుకుంటోంది.

బరువు పెరిగానని...!

బరువు పెరుగుతోందని నాన్న యోగా శిక్షణలో చేర్చితే... దాన్నే కెరీర్‌గానూ మార్చుకుంది భీమవరానికి చెందిన టేకుమూడి శిరీష. ‘అప్పటికి నాకు పద్దెనిమిదేళ్లు. బరువు పెరుగుతున్నానని నాన్న తనతో పాటు యోగాకి తీసుకెళ్లేవారు. అక్కడి గురువు భూపతిరాజు సత్యనారాయణ రాజు నా తీరు చూసి పోటీలకు శిక్షణ కోసం సీతారామయ్య అనే మరో గురువు దగ్గరకు పంపారు. రోజూ కాలేజీ, ట్యూషన్‌ అయిపోయాక పది కిలోమీటర్లు వెళ్లి నేర్చుకునే దాన్ని. తర్వాత జిల్లా, రాష్ట్ర పోటీల్లో పతకాలు అందుకున్నా. యోగాలో పట్టు కోసం... టీచర్‌ ట్రెయినింగ్‌ డిప్లొమా చేశా. హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్లో పాఠాలు చెప్పేదాన్ని. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు తరగతులు నిర్వహించేదాన్ని. 2012లో పెళ్లి తర్వాత విరామం వచ్చినా సాధన మానలేదు. పాపని, ఇంటినీ చూసుకుంటూ, పిల్లలకు శిక్షణ ఇస్తూనే... ఎంఎస్సీ, ఎంఫిల్‌ చేశా. అంకమ్మరావు గారనే గురువు జాతీయ పోటీలకు శిక్షణ ఇచ్చారు. అలా 2018లో జాతీయ యోగాసనాల ఛాంపియన్‌షిప్‌లో నాలుగోస్థానం సాధించా. పంజాబ్‌లో జరిగిన పోటీల్లో కాంస్యం దక్కింది. నా ప్రతిభను గమనించిన శాప్‌ అధికారులు యోగా క్లాసులు చెప్పే అవకాశం కల్పించారు. గతేడాది మలేషియా, దక్షిణాఫ్రికాల్లో ప్రపంచ పోటీలకూ అర్హత సాధించా. కరోనా వల్ల అవి వాయిదా పడ్డాయి. ఈ జనవరిలో వర్చువల్‌గా నిర్వహించిన జాతీయ పోటీల్లో వెండి పతకం అందుకున్నా. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఈ గుర్తింపు సాధించా’ అంటారామె. శిరీష విదేశాల్లోని భారతీయులకు ఆన్‌లైన్‌లో యోగా శిక్షణ ఇస్తోంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకూ తరగతులు తీసుకుంటోంది. పేద చిన్నారులకు ఉచితంగా.. యోగా నేర్పిస్తూ పోటీలకు పంపిస్తోంది.

89 ఏళ్ల వయస్సులోనూ...

శరీరాన్ని విల్లులా వంచుతూ క్లిష్ట ఆసనాలు, కఠోర వ్యాయామాలు అవలీలగా చేస్తూ అబ్బురపరుస్తున్నారీవిడ! పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జీగురు కనకలక్ష్మి (89) 30 ఏళ్లుగా నిత్యం తెల్లవారు జామున 4 గంటలకే యోగాసనాలు వేస్తుంటారు. తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వైద్యుల సూచనల మేరకు అరవైయ్యేళ్ల వయసులో యోగా నేర్చుకున్నారు. ఈవిడను ఊళ్లో అందరూ యోగా బామ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. చిన్నతనంలో అంబలి, గట్కా, వ్యవసాయ పనులు వెళ్లడం వల్లే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి వేళలో పండ్లు, అల్పాహారం తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యం అంటారు బామ్మ. ఇంట్లో అన్ని పనులు తనే అవలీలగా చేసేసుకుంటారు. తన గురించి తెలుసుకుని చాలా మంది వచ్చి కలిసి మాట్లాడి వెళ్తూంటారు. స్థానిక యువత, మహిళలు తనను ఆదర్శంగా తీసుకుని యోగా చేస్తుండటం సంతోషాన్ని ఇస్తోందని కనలక్ష్మి చెబుతున్నారు. తన నలుగురు కొడుకులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. కూతురును ప్రభుత్వోద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవని ఈ బామ్మ భరోసాగా చెబుతున్నారు.

- మిరియాల గణేష్‌ కుమార్‌, ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

మంచిమాట

కొత్త బాధ్యతలు తీసుకోవడానికి భయపడొద్దు. రిస్క్‌ తీసుకున్నప్పుడే పెద్ద అవకాశాలు వస్తాయి.

- కీర్తిగా రెడ్డి, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, సాఫ్ట్‌బ్యాంక్‌

ఇదీ చదవండి: పోటెత్తిన వరద- బిక్కుబిక్కుమంటూ 20 గ్రామాల ప్రజలు

అర్పితా రాయ్‌ భవిష్యత్తు గురించి అందమైన కలలు కనేది. కానీ ఓ దుర్ఘటన తన జీవితాన్నే మార్చేసింది. ఆ కష్టాల్ని పంటిబిగువున భరించి...కుంగుబాటుని జయించింది. యోగా గురువుగా మారి ఇలా ఎదుర్కోవాలి జీవితాన్ని అని చూపిస్తోంది.

international yoga day special
ఆ ప్రయాణం స్ఫూర్తిదాయకం

అప్పుడు అర్పితకు 20 ఏళ్లు. 2006, ఏప్రిల్‌లో ఓరోజు బైక్‌లో వెళుతూ అదుపు తప్పి కిందపడిపోయింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లిపోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఎవరో ఆసుపత్రిలో చేర్చారు. ‘ప్రాణం నిలబడినా... రెండుకాళ్లు నుజ్జునుజ్జు అయిపోయాయి. ప్రాణాన్ని కాపాడటం కోసం కాళ్లను తొలగించాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నేను ఇకపై కనీసం అడుగులైనా వేయలేననే ఆలోచనే తీవ్రంగా కుంగదీసింది. నాలుగు నెలలు బెడ్‌ మీదే ఉండటంతో బెడ్‌సోర్స్‌ వచ్చాయి. ఆ బాధలన్నీ పంటి బిగువునే భరించా. ఇంటికి చేరుకున్నాక బంధువులు, తెలిసిన వారు ఏవేవో చెప్పే వారు. అవన్నీ నాపై తీవ్ర ప్రభావాన్ని చూపేవి. వీటన్నింటినీ దాటి, నన్ను నేను కాపాడుకోవాలనే ఆలోచన నాలో మొదలైంది. నాలాంటి వాళ్ల విజయాల గురించి చదవడం మొదలుపెట్టా’ అని గుర్తు చేసుకుంటుంది అర్పిత.

పదిసార్లకు పైగా విఫలమై...

వైద్యులు అర్పితకు కృత్రిమ కాళ్లను పెట్టారు. ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల తర్వాత మెల్లిగా అడుగులేయడం ప్రారంభించింది. ఫిజియోథెరపీతో పాటు యోగా కూడా చేసేది. అలా కొంత ఉపశమనం వచ్చిందామెకు. ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే తన వైకల్యం తెలియకుండా దుస్తులు ధరించి పోస్ట్‌ చేసేది. ఆ సమయంలో ఓ స్నేహితుడు ‘మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనలోని లోపాన్ని అంగీకరించడం నేర్చుకుంటేనే జీవితాన్ని జయించగలం’ అని చెప్పాడు. ఆ మాటలు తన దృక్పథాన్ని మార్చేశాయి. ‘నా ఫ్రెండ్‌ మాటలలో నా కృత్రిమ కాళ్లు తెలిసేలా యోగా భంగిమ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పెట్టా. అయితే ఏం వ్యాఖ్యలు వస్తాయో అనే భయంతో రోజంతా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశా. మరుసటి రోజు చూస్తే... ఎంతోమంది ప్రశంసించారు. వీరిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఇక అప్పటినుంచి ఆన్‌లైన్‌లో యోగా బోధిస్తున్నా. దేశవ్యాప్తంగా అయిదు వందల మందికిపైగా వీటికి హాజరవుతున్నారు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉండేందుకు బరువును తగ్గించుకున్నా. నేను నేర్పే ప్రతి వ్యాయామం కృత్రిమకాళ్లతో చేయడం కష్టం. పదిసార్లుకు పైగా విఫలమై, ఆ తర్వాతే శీర్షాసనం వేయగలిగా. నా విజయాన్నే కాదు, నా ఇబ్బందులు కూడా అందరికీ తెలియజేసేలా వీడియోలను పోస్ట్‌ చేస్తుంటా. అప్పుడే కదా... వైఫల్యం నుంచి విజయం ఎలా సాధించాలో తెలుస్తుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది. చాలా కాంటెస్ట్‌ల్లో విజేతగా నిలిచా. యోగా జర్నల్‌లో నా గురించి ప్రచురించడం మరవలేను. ఇవన్నీ నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూనే ఉన్నాయి’ అని చెబుతున్న అర్పితారాయ్‌ త్వరలో కృత్రిమ అవయవాల కేంద్రాలతో కలిసి పనిచేయనుంది. వికలాంగులకు కౌన్సిలింగ్‌తో ఆత్మవిశ్వాసాన్ని అందించాలనుకుంటోంది.

బరువు పెరిగానని...!

బరువు పెరుగుతోందని నాన్న యోగా శిక్షణలో చేర్చితే... దాన్నే కెరీర్‌గానూ మార్చుకుంది భీమవరానికి చెందిన టేకుమూడి శిరీష. ‘అప్పటికి నాకు పద్దెనిమిదేళ్లు. బరువు పెరుగుతున్నానని నాన్న తనతో పాటు యోగాకి తీసుకెళ్లేవారు. అక్కడి గురువు భూపతిరాజు సత్యనారాయణ రాజు నా తీరు చూసి పోటీలకు శిక్షణ కోసం సీతారామయ్య అనే మరో గురువు దగ్గరకు పంపారు. రోజూ కాలేజీ, ట్యూషన్‌ అయిపోయాక పది కిలోమీటర్లు వెళ్లి నేర్చుకునే దాన్ని. తర్వాత జిల్లా, రాష్ట్ర పోటీల్లో పతకాలు అందుకున్నా. యోగాలో పట్టు కోసం... టీచర్‌ ట్రెయినింగ్‌ డిప్లొమా చేశా. హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్లో పాఠాలు చెప్పేదాన్ని. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు తరగతులు నిర్వహించేదాన్ని. 2012లో పెళ్లి తర్వాత విరామం వచ్చినా సాధన మానలేదు. పాపని, ఇంటినీ చూసుకుంటూ, పిల్లలకు శిక్షణ ఇస్తూనే... ఎంఎస్సీ, ఎంఫిల్‌ చేశా. అంకమ్మరావు గారనే గురువు జాతీయ పోటీలకు శిక్షణ ఇచ్చారు. అలా 2018లో జాతీయ యోగాసనాల ఛాంపియన్‌షిప్‌లో నాలుగోస్థానం సాధించా. పంజాబ్‌లో జరిగిన పోటీల్లో కాంస్యం దక్కింది. నా ప్రతిభను గమనించిన శాప్‌ అధికారులు యోగా క్లాసులు చెప్పే అవకాశం కల్పించారు. గతేడాది మలేషియా, దక్షిణాఫ్రికాల్లో ప్రపంచ పోటీలకూ అర్హత సాధించా. కరోనా వల్ల అవి వాయిదా పడ్డాయి. ఈ జనవరిలో వర్చువల్‌గా నిర్వహించిన జాతీయ పోటీల్లో వెండి పతకం అందుకున్నా. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఈ గుర్తింపు సాధించా’ అంటారామె. శిరీష విదేశాల్లోని భారతీయులకు ఆన్‌లైన్‌లో యోగా శిక్షణ ఇస్తోంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకూ తరగతులు తీసుకుంటోంది. పేద చిన్నారులకు ఉచితంగా.. యోగా నేర్పిస్తూ పోటీలకు పంపిస్తోంది.

89 ఏళ్ల వయస్సులోనూ...

శరీరాన్ని విల్లులా వంచుతూ క్లిష్ట ఆసనాలు, కఠోర వ్యాయామాలు అవలీలగా చేస్తూ అబ్బురపరుస్తున్నారీవిడ! పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జీగురు కనకలక్ష్మి (89) 30 ఏళ్లుగా నిత్యం తెల్లవారు జామున 4 గంటలకే యోగాసనాలు వేస్తుంటారు. తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వైద్యుల సూచనల మేరకు అరవైయ్యేళ్ల వయసులో యోగా నేర్చుకున్నారు. ఈవిడను ఊళ్లో అందరూ యోగా బామ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. చిన్నతనంలో అంబలి, గట్కా, వ్యవసాయ పనులు వెళ్లడం వల్లే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి వేళలో పండ్లు, అల్పాహారం తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యం అంటారు బామ్మ. ఇంట్లో అన్ని పనులు తనే అవలీలగా చేసేసుకుంటారు. తన గురించి తెలుసుకుని చాలా మంది వచ్చి కలిసి మాట్లాడి వెళ్తూంటారు. స్థానిక యువత, మహిళలు తనను ఆదర్శంగా తీసుకుని యోగా చేస్తుండటం సంతోషాన్ని ఇస్తోందని కనలక్ష్మి చెబుతున్నారు. తన నలుగురు కొడుకులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. కూతురును ప్రభుత్వోద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవని ఈ బామ్మ భరోసాగా చెబుతున్నారు.

- మిరియాల గణేష్‌ కుమార్‌, ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

మంచిమాట

కొత్త బాధ్యతలు తీసుకోవడానికి భయపడొద్దు. రిస్క్‌ తీసుకున్నప్పుడే పెద్ద అవకాశాలు వస్తాయి.

- కీర్తిగా రెడ్డి, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, సాఫ్ట్‌బ్యాంక్‌

ఇదీ చదవండి: పోటెత్తిన వరద- బిక్కుబిక్కుమంటూ 20 గ్రామాల ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.