1. 'సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం'
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో అప్రమత్తంగా ఉండి.. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సీఎంతో సినీరంగ ప్రముఖులు
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముగిసిన ఉపసంహరణ గడువు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 25 నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు!
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 25 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తీర్పు కాపీతో ఎస్ఈసీ వద్దకు రేవంత్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో ఎంపీ రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంపై హైకోర్టు తీర్పు నకలును కమిషనర్కు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'జల సంరక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీ'
దేశంలోని నదులు, చెరువులను సంరక్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ హరిత ట్రైబ్యునల్. నీటి వనరుల సంరక్షణకు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'యాసిడ్ దాడి బాధితులకు పరిహారం ఇవ్వరేం?'
దేశంలో 1,273 మంది యాసిడ్ దాడి బాధితుల్లో 799 మందికి పరిహారం అందలేదని ఎన్సీడబ్ల్యూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పలు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నోడల్ అధికారులతో వర్చువల్ సమావేశంలో చర్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'సమష్టి కృషితోనే అరికట్టగలం'
జీ-20 సదస్సులో ఆయా దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. కరోనా మహమ్మారి అంతం, వ్యాక్సిన్ పంపిణీ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, వాటికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'ఏ స్థానంలోనైనా సిద్ధం'
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపాడు టీమ్ఇండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం తాను మానసికంగా దృఢంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మాల్దీవుల్లో సమంత.. రౌడీ హీరో ప్రశంసలు
టాలీవుడ్ నుంచి సరికొత్త అప్డేట్స్ మీ ముందుకొచ్చాయి. వీటిలో సమంత విహారయాత్ర, విజయ్ దేవరకొండ ప్రశంసలు, 'టెనెట్' విడుదల, అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు గురించి ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.