ETV Bharat / city

ఆర్టీసీ ఎండీకి పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ నోటీసులు

author img

By

Published : Nov 8, 2019, 1:11 PM IST

Updated : Nov 8, 2019, 2:02 PM IST

ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీకి పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ నోటీసులు పంపారు. కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో రూ.760 కోట్లు జమ కాలేదని వెల్లడించారు. ఈనెల 15 లోగా పూర్తి సమాచారంతో హాజరుకావాలని పేర్కొన్నారు.

tsrtc strike

ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ బకాయిల విషయంలో ఆర్టీసీ అధికారులకు ప్రావిడెంట్ ఫండ్ అధికారులు నోటీసులు పంపారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన రూ.760.62 కోట్లు జమ చేయనట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీకి పంపిన నోటీసులో పీఎఫ్ రీజనల్ కమిషనర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 15లోపు పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని కోరారు.

ప్రావిడెంట్ ఫండ్ ఎప్పటికప్పుడు చెల్లించని పక్షంలో భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీకి తాజా నోటీసులతో మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లైంది.

ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ బకాయిల విషయంలో ఆర్టీసీ అధికారులకు ప్రావిడెంట్ ఫండ్ అధికారులు నోటీసులు పంపారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన రూ.760.62 కోట్లు జమ చేయనట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీకి పంపిన నోటీసులో పీఎఫ్ రీజనల్ కమిషనర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 15లోపు పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని కోరారు.

ప్రావిడెంట్ ఫండ్ ఎప్పటికప్పుడు చెల్లించని పక్షంలో భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీకి తాజా నోటీసులతో మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లైంది.

ఇదీ చూడండి: ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై విచారణ వాయిదా

Last Updated : Nov 8, 2019, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.