ETV Bharat / city

డిజిటల్ తరగతులకు విశేష స్పందన: సబితా ఇంద్రారెడ్డి

author img

By

Published : Sep 2, 2020, 4:59 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రారంభించిన... డిజిటల్ తరగతులకు విశేష స్పందన లభించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొదటి రోజున 85.42శాతం విద్యార్థులు వీక్షించినట్టు వెల్లడించారు.

education minister sabitha indra reddy comments on digital classes
డిజిటల్ తరగతులకు విశేష స్పందన: సబితా ఇంద్రారెడ్డి

విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా చేపట్టిన డిజిటల్ తరగతులకు విశేష స్పందన లభించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలను తెరవలేని పరిస్థితులు నెలకొనడం వల్ల తాత్కాలికంగా పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. మొదటి రోజున 85.42 శాతం మంది పాఠశాల స్థాయి విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా డిజిటల్ తరగతులు వీక్షించినట్టు తేలిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితులు సమీక్షించారని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి పదో తరగతి వరకు 16 లక్షల 43 వేల 309 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి వివరించారు. వీరిలో మంగళవారం నాడు 14 లక్షల 3 వేల 826 మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షించారని వెల్లడించారు. దూరదర్శన్, టీ-సాట్ ద్వారా 10 లక్షల 72 వేల 851 మంది, స్మార్ట్ ఫోన్, లాప్​టాప్, కంప్యూటర్ ద్వారా... 1 లక్షల 91 వేల 768 మంది విద్యార్థులు డిజిటల్ తరగతులను వీక్షించినట్టు మంత్రి వివరించారు. పంచాయతీ, గ్రంధాలయాల్లో 78 వేల 696 మంది విద్యార్థులు, టీఎస్ యాప్ ద్వారా లక్ష 56 వేల 688 మంది విద్యార్థులు చూసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న విద్యార్థులను కలిసి డిజిటల్ తరగతుల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 42 వేల 979 మంది విద్యార్థులు వర్క్ షీట్లను కూడా పరిశీలించినట్లు మంత్రి వివరించారు.

విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా చేపట్టిన డిజిటల్ తరగతులకు విశేష స్పందన లభించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలను తెరవలేని పరిస్థితులు నెలకొనడం వల్ల తాత్కాలికంగా పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. మొదటి రోజున 85.42 శాతం మంది పాఠశాల స్థాయి విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా డిజిటల్ తరగతులు వీక్షించినట్టు తేలిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితులు సమీక్షించారని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి పదో తరగతి వరకు 16 లక్షల 43 వేల 309 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి వివరించారు. వీరిలో మంగళవారం నాడు 14 లక్షల 3 వేల 826 మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షించారని వెల్లడించారు. దూరదర్శన్, టీ-సాట్ ద్వారా 10 లక్షల 72 వేల 851 మంది, స్మార్ట్ ఫోన్, లాప్​టాప్, కంప్యూటర్ ద్వారా... 1 లక్షల 91 వేల 768 మంది విద్యార్థులు డిజిటల్ తరగతులను వీక్షించినట్టు మంత్రి వివరించారు. పంచాయతీ, గ్రంధాలయాల్లో 78 వేల 696 మంది విద్యార్థులు, టీఎస్ యాప్ ద్వారా లక్ష 56 వేల 688 మంది విద్యార్థులు చూసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న విద్యార్థులను కలిసి డిజిటల్ తరగతుల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 42 వేల 979 మంది విద్యార్థులు వర్క్ షీట్లను కూడా పరిశీలించినట్లు మంత్రి వివరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.