ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆదివారం నుంచి ఈ-పాస్ లను జారీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర కొవిడ్ ప్రత్యేకాధికారి కృష్ణబాబు తెలిపారు. వివరాలను స్పందన వెబ్సైట్లో నమోదు చేసుకుంటే.. ఆటోమేటిక్ విధానంలో మొబైల్, ఈ-మెయిల్ లకు వెంటనే ఈ-పాస్ లు జారీ అవుతాయని వివరించారు. చెక్ పోస్టుల వద్ద గుర్తింపు పత్రం, ఈ-పాస్ చూపితే అనుమతిస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు, తర్వాత ఆరా తీసేందుకు మాత్రమే స్పందనలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగానే క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సిబ్బంది తనిఖీలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు