జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వేర్వేరు వైద్యమండళ్లలో సభ్యుల నియామకాలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సెర్చ్ కమిటీని నియమించింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఛైర్పర్సన్గా వ్యవహరించే ఈ కమిటీలో ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో తెలంగాణ నుంచి జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డిని ఒక సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఆయుర్వేద బోర్డ్, యునానీ, సిద్ధ బోర్డ్, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ తదితర విభాగాలకు సంబంధించిన బోర్డుల్లో సభ్యులను నియమించడానికి వీలుగా అర్హులైన అభ్యర్థులను ప్రభుత్వానికి ఈ సెర్చ్ కమిటీ సిఫార్సు చేస్తుంది. దేశంలో వైద్యవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కొత్తగా ఏర్పడనున్న బోర్డులు క్రియాశీలకంగా పనిచేస్తాయి.