ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు (Delta pluse case) గుర్తించామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బాధితునికి చికిత్స కూడా పూర్తైందని ఆయన అన్నారు. ఏపీలో కొవిడ్ పరిస్థితిపై చర్చించామని.. లాక్డౌన్ అంశంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు: మంత్రి శ్రీనివాస్ గౌడ్